నాలుగు దేశాల టోర్నమెంట్లో భారత మహిళల హాకీ జట్టు పోరాటం ముగిసింది.
నాలుగు దేశాల హాకీ టోర్నీలో చివరిస్థానం
డార్విన్ (ఆస్ట్రేలియా): నాలుగు దేశాల టోర్నమెంట్లో భారత మహిళల హాకీ జట్టు పోరాటం ముగిసింది. శనివారం జరిగిన కాంస్య పతక పోరులో 1-2 తేడాతో జపాన్ చేతిలో పరాజయం పాలైంది. భారత్ తరఫున వందన కటారియా (37వ ని.) ఏకైక గోల్ చేయగా... మొటామి కవామురా, మినామి షిమిజు చెరో గోల్ చేసి జపాన్కు విజయాన్ని అందించారు.