
వర్షం ఎఫెక్ట్: మ్యాచ్ కుదింపు
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న వన్డేకు పలుమార్లు వరుణుడు అంతరాయం కల్గించడంతో మ్యాచ్ ను 48.0 ఓవర్లకు కుదించారు.
బర్మింగ్హోమ్:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న వన్డేకు పలుమార్లు వరుణుడు అంతరాయం కల్గించడంతో మ్యాచ్ ను 48.0 ఓవర్లకు కుదించారు. రెండోసారి వర్షం విరామం తరువాత పిచ్ ను పరిశీలించిన అంపైర్లు రెండు ఓవర్లను తగ్గించారు. ఓ మోస్తరుగా చినుకులు పడుతూ మ్యాచ్ కు పదే పదే ఆటంకం కలుగుతూ ఉండటంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు శిఖర్ ధావన్(68;65 బంతుల్లో 6 ఫోర్లు,1 సిక్స్), రోహిత్ శర్మ(91;119 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) శుభారంభం అందించారు. ఈ జోడి తొలి వికెట్ కు 136 పరుగులు జోడించి భారత్ ను పటిష్ట స్థితికి చేర్చారు.