
ఆసీస్ చేతిలో భారత్ ఓటమి
చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు ఫైనల్ బెర్తు అవకాశాలను క్లిష్టం చేసుకుంది.
చాంపియన్స్ ట్రోఫీ హాకీ
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు ఫైనల్ బెర్తు అవకాశాలను క్లిష్టం చేసుకుంది. గురువారం జరిగిన పోరులో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో 2-4 గోల్స్ తేడాతో భారత్ పరాజయం పాలైంది. ఆసీస్ తరఫున మిట్టన్ (21వ ని.), జలెవ్స్కీ (23వ ని.), ఫ్లిన్ ఓగ్లివీ (35వ ని.) గోల్స్ చేశారు. ద్వితీయార్థంలో లభించిన రెండో పెనాల్టీ కార్నర్ను రఘునాథ్ (45వ ని.) గోల్గా మలిచి భారత్కు తొలి గోల్ను అందించాడు. ఆ వెంటనే వైట్ (45వ ని.) మరో కౌంటర్ అటాక్తో భారత్కు షాక్నిచ్చాడు.
ఈ దశలో మన్దీప్ సింగ్ (49వ ని.) గోల్ చేసి ఆధిక్యాన్ని 2-4కు తగ్గించాడు. చివర్లో గోల్ అవకాశాలు వచ్చినప్పటికీ భారత్ గోల్ చే యడంలో విఫలమైంది. బ్రిటన్, బెల్జియంల మధ్య జరిగే మ్యాచ్ డ్రా అయితే భారత్ ఫైనల్కు చేరుతుంది. లేదంటే కాంస్య పతకం కోసం పోరాడాల్సి ఉంటుంది.