ముగిసిన జోష్నా పోరు | India ended the fighting in the world of women's squash championship | Sakshi
Sakshi News home page

ముగిసిన జోష్నా పోరు

Apr 28 2016 1:07 AM | Updated on Sep 3 2017 10:53 PM

ప్రపంచ మహిళల స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత పోరాటం ముగిసింది.

కౌలాలంపూర్ (మలేసియా): ప్రపంచ మహిళల స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 14వ ర్యాంకర్ జోష్నా చిన్నప్ప 3-11, 6-11, 3-11తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లారా మసారో (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయింది.

ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో జోష్నా తన ప్రత్యర్థికి ఏదశలోనూ పోటీనివ్వలేదు. ఇదే టోర్నీలో భారత్‌కే చెందిన మరో క్రీడాకారిణి దీపిక పళ్లికల్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయిన సంగతి తెలిసిందే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement