కోర్టుకెక్కిన సూపర్ కింగ్స్ | Image for the news result IPL Working Group Report on Fate of Chennai Super Kings, Rajasthan Royals Ready | Sakshi
Sakshi News home page

కోర్టుకెక్కిన సూపర్ కింగ్స్

Aug 21 2015 12:10 AM | Updated on Oct 8 2018 3:56 PM

ఐపీఎల్‌నుంచి తమ జట్టును తప్పించాలంటూ లోధా కమిటీ చేసిన సిఫారసును సవాల్ చేస్తూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం కోర్టుకెక్కింది.

చెన్నై: ఐపీఎల్‌నుంచి తమ జట్టును తప్పించాలంటూ లోధా కమిటీ చేసిన సిఫారసును సవాల్ చేస్తూ  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం కోర్టుకెక్కింది. మద్రాస్ హైకోర్టులో చెన్నై టీమ్ దీనిపై అఫిడవిట్ దాఖలు చేసింది. లోధా కమిటీ ఆదేశాలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేవిగా, సహజ న్యాయానికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించింది. తమ వాదన వినిపించుకునే అవకాశం సరిగా ఇవ్వకుండా ఉందన్న సీఎస్‌కే యాజమాన్యం...తాము 4.1.1 క్లాజ్‌ను ఉల్లంఘించామో లేదో స్పష్టత లేకుండా కమిటీ శిక్షకు సిఫారసు చేసిందని ఆరోపించింది. కాబట్టి లోధా కమిటీ ఉత్తర్వులపై స్టే విధించాలని కోర్టును కోరింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement