అథ్లెట్లకు కేంద్ర క్రీడా శాఖ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: తమ నుంచి నిధులు పొందాలనుకుంటే కచ్చితంగా భారత్కు ఆడాల్సిందేనని అథ్లెట్లకు కేంద్ర క్రీడా శాఖ అల్టిమేటం జారీ చేసింది. ఎప్పుడు పిలిచినా అథ్లెట్లు అందుబాటులో ఉండాలని సూచించింది. ఇంచియాన్ ఏషియాడ్లో ఆడటానికి చాలా మంది ఆటగాళ్లు అయిష్టత వ్యక్తం చేయడంతో క్రీడా శాఖ ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంది. అయితే ఇలాంటి నిబంధనలను గతేడాదే అన్ని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు పంపించినా అవి సరిగా అమలుకాకపోవడంతో మరోసారి వాటిని బయటకు తీసుకొచ్చింది.
ఇప్పట్నించి ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ‘ఆసియా క్రీడల కోసం భారత బృందాన్ని ఎంపిక చేసిన తర్వాత ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు మేం ఆడబోమని చెప్పారు. ఇది మా దృష్టికి వచ్చింది. గేమ్స్లో కాకుండా ప్రైజ్మనీ వచ్చే టోర్నీల్లో ఆడేందుకు వాళ్లు మొగ్గు చూపారు. వీళ్లు ఈ పోటీలను సీరియస్గా తీసుకోవడం లేదని తేలింది. గేమ్స్ నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయి. ఇలాంటి టోర్నీలో ఎక్కువ పతకాలు గెలిస్తే దేశ ప్రతిష్ట పెరుగుతుంది’ అని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పేస్, బోపన్న, సోమ్దేవ్లను ఉద్దేశించి ఈ ప్రకటన చేసినట్లు సమాచారం.
టెన్నిస్ ఆటగాళ్లకు ఏఐటీఏ మద్దతు
అంతర్జాతీయ టోర్నీలకు డుమ్మా కొడితే ఆర్థిక సహాయం చేయబోమని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఐఏటీఏ) స్పందించింది. సోమ్దేవ్, పేస్, బోపన్నలు ఏషియాడ్లో ఆడకపోవడానికి కారణాలను వెల్లడించింది. ‘ఆటగాళ్ల నిర్ణయాన్ని ప్రభుత్వం తప్పుగా అర్థం చేసుకుంది. అంతకు వారం కిందటే ఆ ముగ్గురు డేవిస్ కప్లో ఆడారు.
హోరాహోరీ పోరులో సెర్బియా చేతిలో ఓడారు. వాళ్లకు దేశం పట్ల ఎలాంటి అంకితభావం ఉందో ఈ మ్యాచ్లను చూస్తే తెలిసిపోతుంది. ఆటగాళ్లకు మెరుగైన ర్యాంక్లు ఉండటం చాలా అవసరం. లేదంటే దేశం తరఫున గ్రాండ్స్లామ్, ఒలింపిక్స్లో ఆడలేరు’ అని ఏఐటీఏ సెక్రటరీ జనరల్ భరత్ ఓజా అన్నారు.
గేమ్స్లో ఆడకపోవడం వల్ల ఆటగాళ్లు పెద్ద మొత్తంలో డబ్బును త్యాగం చేశారన్నారు. ‘గేమ్స్లో ఆడితే ఈ ముగ్గురికి పతకాలు వచ్చేవి. అప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నగదు పురస్కారాలు ఇచ్చేవి. కానీ గేమ్స్ నుంచి వైదొలిగి ఏటీపీ, చాలెంజర్ టోర్నీలో ఆడటం వల్ల దీన్ని నష్టపోయారు. కారణం ర్యాంక్లను కాపాడుకోవాలన్న లక్ష్యమే’ అని ఓజా వ్యాఖ్యానించారు.
డబ్బులు కావాలంటే భారత్కు ఆడాల్సిందే!
Published Thu, Oct 30 2014 12:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement