న్యూఢిల్లీ : ఆసియా క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్లు ఆకట్టుకున్నారు. గురువారం తొలి రోజు భారత్కు మొత్తం 5 పతకాలు దక్కాయి. 85 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో అరుణ్ కుమార్, 50 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో ప్రదీప్ స్వర్ణాలు గెలుచుకున్నారు. అరుణ్ 7-6తో హషిమిజుబర్ (ఇరాన్)పై విజయం సాధించగా, ప్రదీప్ 6-0తో సన్షిరో (జపాన్)ను చిత్తు చేశాడు. 100 కేజీల ఫ్రీస్టైల్లో నాసిర్ హుస్సేన్కు రజతం దక్కింది. మహిళల 40 కేజీల ఫ్రీ స్టైల్లో అన్నూదేవి రజత పతకం, 35 కేజీల ఫ్రీస్టైల్లో అంకుశ్ కాంస్యం గెలుచుకున్నారు.
Related news
-
సిద్దార్థ్ లూథ్రా కి నేను ఒక్కటే చెప్పా..!
సిద్దార్థ్ లూథ్రా కి నేను ఒక్కటే చెప్పా..! -
భారత రెజ్లర్లకు మూడు పతకాలు
బిష్క్క్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో తొలి రోజు భారత ఫ్రీస్టయిల్ రెజ్లర్లు మూడు పతకాలు సాధించారు. ఉదిత్ (57 కేజీలు) రజతం నెగ్గగా... అభిమన్యు (70 కేజీలు), విక్కీ (97 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఫైనల్లో ఉదిత్ 4–5తో కెంటో యుమియా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. బౌట్ చివరి సెకన్లలో ఉదిత్ ప్రత్యర్థికి ఒక పాయింట్ కోల్పోయాడు. 2020 నుంచి 2023 వరకు ఈ విభాగంలో భారత్కు స్వర్ణ పతకాలు లభించాయి. రవి కుమార్ దహియా వరుసగా మూడేళ్లు (2020, 2021, 2022)... గత ఏడాది అమన్ ఈ విభాగంలో పసిడి పతకాలు నెగ్గారు. మరోవైపు కాంస్య పతకాల బౌట్లలో అభిమన్యు 6–5తో కుల్దాòÙవ్ (ఉజ్బెకిస్తాన్)పై, విక్కీ 10–1తో అరోనోవ్ (కిర్గిస్తాన్)పై గెలుపొందారు. -
మేడారం జాతరకు 30 జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్, కాజీపేట రూరల్: తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క, సారక్క జాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 30 జన్ సాధా రణ్ ప్రత్యేక రైళ్ల సర్విస్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట, వరంగల్ మీదుగా సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, సిర్పూర్ కాగజ్నగర్ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మేడారం జాతర చేరుకోవడానికి, తిరుగు ప్రయాణానికి అత్యంత సురక్షితమైన వేగవంతమైన తక్కువ ఖర్చుతో కూడిన జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు ఈ నెల 21వ తేదీ నుంచి 24 వరకు ఆయా రూట్ల నుంచి నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ వెల్లడించినట్లు అధికారులు వివరించారు. ప్రత్యేక రైళ్ల వివరాలు ► సికింద్రాబాద్–వరంగల్, వరంగల్–సికింద్రాబాద్ మధ్య 10 రైళ్లు, సిర్పూర్కాగజ్నగర్–వరంగల్, వరంగల్–సిర్పూర్కాగజ్నగర్ మధ్య 8 రైళ్లు, నిజామాబాద్–వరంగల్, వరంగల్–నిజామాబాద్ మధ్య 8 రైళ్లు, ఆదిలాబాద్–వరంగల్, వరంగల్–ఆదిలాబాద్ మధ్య 2 రైళ్లు, ఖమ్మం–వరంగల్, వరంగల్–ఖమ్మం మధ్య 2 రైళ్లు నడుపుతారు. ► 21 నుంచి 25వ తేదీ వరకు సికింద్రాబాద్–వరంగల్ (07014), ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు వరంగల్–సికింద్రాబాద్ (07015) ప్రత్యేక రైలు వరంగల్లో మధ్యాహ్నం 1:55 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్కు సాయంత్రం 6:20 గంటలకు చేరుతుంది. ► 21వ తేదీన వరంగల్–ఆదిలాబాద్ (07023) వెళ్లే ఎక్స్ప్రెస్ వరంగల్లో సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు ఆదిలాబాద్ చేరుతుంది. ► 22వ తేదీన ఆదిలాబాద్–వరంగల్ (07024) వెళ్లే ప్రత్యేక రైలు ఆదిలాబాద్లో రాత్రి 11:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 12:45 గంటలకు వరంగల్ చేరుతుంది. ► 23 తేదీన ఖమ్మం–వరంగల్ (07021) వెళ్లే రైలు ఖమ్మంలో ఉదయం 10 గంటలకు బయలుదేరి వరంగల్కు 12:20 గంటలకు చేరుతుంది. ► 24న వరంగల్–ఖమ్మం (07022) వెళ్లే ప్రత్యేక రైలు వరంగల్లో మధ్యాహ్నం 1:55కు బయలుదేరి ఖమ్మంకి సాయంత్రం 4:30 గంటలకు చేరుతుంది. భక్తుల సౌకర్యార్ధం రైళ్లు: కిషన్రెడ్డి మేడారం సమ్మక్క, సారక్క జాతరకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక రైళ్లను వేయడంతోపాటుగా జాతర ఏర్పాట్లకోసం రూ.3 కోట్లను కేటాయించింది’అని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ‘నరేంద్రమోదీ ప్రభుత్వం, గిరిజన సంస్కృతి, సంప్రదాయాల విషయంలో, గిరిజన సమాజం సంక్షేమం విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అందులో భాగంగానే.. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క, సారక్క జాతర నేపథ్యంలో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతోంది’’అని ఆయన తెలిపారు. -
రైల్వేలకు సంతృప్తికరంగా నిధులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టులకు సంతృప్తికరంగా నిధులు కేటాయించారని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు. తాజా బడ్జెట్లో రైల్వేలకు రూ.2.52 లక్షల కోట్లు కేటాయించగా.. అందులో దక్షిణ మధ్య రైల్వేకి రూ.14,232.84 కోట్లు కేటాయించారన్నారు. ఇందులో తెలంగాణ ప్రాంత వాటా రూ.5,071 కోట్లని, గత బడ్జెట్ కంటే 14.7 శాతం నిధులు అధికంగా కేటాయించారని వివరించారు. శుక్రవారం ఆయన రైల్నిలయంలో మీడియాతో మాట్లాడుతూ, రైలు ప్రయాణికుల భద్రత, సౌకర్యార్థం 40 వేల సాధారణ బోగీలను వందే భారత్ ప్రమాణాలకు తగ్గట్టుగా మార్చనున్నట్లు వివరించారు. ఈసారి పీఎం గతిశక్తి కింద పలు ప్రాజెక్టులను గుర్తించినట్లు తెలిపారు. కవచ్ వ్యవస్థ అభివృద్ధి కోసం ఈ సారి రూ.41.94 కోట్లు కేటాయించారన్నారు. తాజా బడ్జెట్లో నిధులు తగ్గినట్లు కనిపించినప్పటికీ ఇది మధ్యతరం మాత్రమేనని, పూర్తిస్థాయి బడ్జెట్లో నిధులు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భద్రాచలం రోడ్ – డోర్నకల్ డబ్లింగ్ ప్రాజెక్టు కింద రూ. 770.12 కోట్లతో 54.65 కిలోమీటర్లు అభివృద్ధిచేయనున్నట్లు వివరించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ సారి రెండు బైపాస్ లైన్ల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించారని, ఇందులో కాజీపేట్ బైపాస్ లైన్ 10.65 కిలోమీటర్లు, వికారాబాద్ మార్గంలో 2.8 కిలోమీటర్లు నిర్మించనున్నట్లు వివరించారు. ఈ పదేళ్లలో రాష్ట్రానికి కేటాయింపులు దాదాపు 20 రెట్లు పెరిగాయని తెలిపారు. -
వికారాబాద్–కృష్ణారైల్వే లైన్కు ప్రణాళికలు సిద్ధం చేయండి
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. మంగళవారం సచివాలయంలో సీఎంను అరుణ్కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రైల్వే లైన్ల అభివృద్ధి, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించారు. గతంలో ప్రతిపాదించిన వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధిపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఈ మార్గాన్ని పూర్తి చేయాల్సిన అవసరముందని సీఎం సూచించారు. ఈ మార్గాన్ని పూర్తి చేస్తే పరిసర ప్రాంతాల అభివృద్ధి వేగవంతమవుతుందని, పరిశ్రమలను నెలకొల్పేందుకు వీలుంటుందని చెప్పారు. అలాగే వివేక్ కె.టంకా నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మంగళవారం సీఎం రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. బృందంలో రాజ్యసభ సభ్యుడు వందన చవాన్, కనకమేడల రవీంద్రకుమార్, దర్శన సింగ్, విల్సన్, లోక్సభ సభ్యుడు వీణాదేవి, జస్బీర్సింగ్ గిల్, రఘురామ కృష్ణరాజు ఉన్నారు.
Related News by category
-
Olympics–2024: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ ఈవెంట్లో తొలి అడుగు..!
'ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ ఈవెంట్లో టేబుల్ టెన్నిస్ క్రీడాంశంలో భారత్ నుంచి టీమ్ ప్రాతినిధ్యం ఎన్నడూ లేదు. వ్యక్తిగత విభాగాల్లో మన ప్లేయర్లు బరిలోకి దిగినా ఏనాడూ పతకానికి చేరువగా రాలేదు. అయితే ఈతరంలో కొత్తగా దూసుకొచ్చిన టీటీ బృందం ఆశలు రేపుతోంది. ఇటీవల వరుస విజయాలతో భారత జట్టు పారిస్ ఒలింపిక్స్–2024కు అర్హత సాధించింది. సమష్టి ప్రదర్శనలతో మన ప్యాడ్లర్లు ఆకట్టుకున్నారు. అటు పురుషుల, ఇటు మహిళల విభాగాల్లోనూ తొలిసారి భారత జట్టు.. టీమ్ ఈవెంట్స్ బరిలోకి దిగనుండటం విశేషం. దేశం తరఫున ఒలింపిక్స్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఆ పది మంది ప్లేయర్ల వివరాలను చూస్తే..' ఆచంట శరత్ కమల్: భారత టేబుల్ టెన్నిస్లో నిస్సందేహంగా ఆల్టైమ్ గ్రేట్. చెన్నైకి చెందిన 41 ఏళ్ల శరత్ కమల్కి ఏకంగా 10సార్లు జాతీయ చాంపియన్గా నిలిచిన ఘనత ఉంది. సుదీర్ఘ కాలంగా భారత టీటీకి దిక్సూచిలా, మార్గదర్శిలా ముందుండి నడిపిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో పలు కీలక విజయాలతో ప్రతిసారీ మన దేశ ఆశలు మోస్తున్న సీనియర్ ప్లేయర్. 2006 నుంచి 2022 మధ్య ఆరుసార్లు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న శరత్ కమల్ 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు గెలుచుకున్నాడు. రెండు ఆసియా క్రీడల కాంస్యాలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. 2004 ఒలింపిక్స్లో పాల్గొన్న అతను ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఒలింపిక్స్ బరిలోకి దిగుతుండటం విశేషం. క్రీడా పురస్కారాలు అర్జున, ఖేల్రత్నలతో పాటు పౌర పురస్కారం పద్మశ్రీ కూడా అందుకున్నాడు. సత్యన్ జ్ఞానశేఖరన్: 31 ఏళ్ల సత్యన్ స్వస్థలం చెన్నై. నాలుగేళ్ల క్రితం ప్రపంచ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్లో 24వ స్థానానికి చేరిన సత్యన్.. టాప్–25లోకి అడుగు పెట్టిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటికీ వరల్డ్ ర్యాంకింగ్స్లో భారత్ తరఫున అతనే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కామన్వెల్త్ క్రీడల్లో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు సాధించిన సత్యన్ ఆసియా క్రీడల్లోనూ ఒక కాంస్యం అందుకున్నాడు. 2018లో అతనికి అర్జున అవార్డు దక్కింది. మానవ్ ఠక్కర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ అండర్–18 స్థాయి ర్యాంకింగ్స్లో నంబర్వన్కు చేరుకోవడంతో మానవ్ ఠక్కర్కు తొలిసారి చెప్పుకోదగ్గ గుర్తింపు లభించింది. ఆ తర్వాత అండర్–21లోనూ అతను నంబర్వన్గా నిలిచాడు. 23 ఏళ్ల ఠక్కర్ స్వస్థలం గుజరాత్లోని రాజ్కోట్. ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో ఒక కాంస్యం, ఆసియా చాంపియన్షిప్లో 3 కాంస్యాలు సాధించాడు. శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్ తర్వాత ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక టీటీ లీగ్ బుందేస్లిగాలో ఆడిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. భారత వర్ధమాన ఆటగాళ్లలో అందరికంటే ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఠక్కర్ ఒలింపిక్స్లో పతకం గెలవడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. హర్మీత్ దేశాయ్: గుజరాత్లోని సూరత్కు చెందిన హర్మీత్ దేశాయ్ కామన్వెల్త్ క్రీడల్లో 2 స్వర్ణాలు, 1 కాంస్యంతో పాటు ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించాడు. ఆసియా చాంపియన్షిప్లో 3 కాంస్యాలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. వరల్డ్ జూనియర్ చాంపియన్షిప్ను సొంతం చేసుకున్న భారత జట్టులో హర్మీత్ సభ్యుడిగా ఉన్నాడు. 30 ఏళ్ల హర్మీత్ గుజరాత్ నుంచి జాతీయ విజేతగా నిలిచిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. క్రీడా పురస్కారం అర్జున అవార్డు అతని ఖాతాలో ఉంది. మనుష్ షా: 22 ఏళ్ల మనుష్ షా స్వస్థలం గుజరాత్లోని వడోదరా. రెండేళ్ల క్రితం సీనియర్ నేషనల్స్లో కాంస్యం సాధించడంతో వెలుగులోకి వచ్చిన అతను అంతే వేగంగా దూసుకుపోయాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత్ నుంచి టాప్–100లోకి వచ్చిన పిన్న వయస్కుడిగా అతను గుర్తింపు పొందాడు. 10 ఏళ్ల క్రికెటర్గా మారే ప్రయత్నంలో అతను సాధన కొనసాగించాడు. అయితే స్కూల్లో ఎత్తు నుంచి పడిపోవడంతో డాక్టర్ల సూచనతో అవుట్డోర్ ఆటకు గుడ్బై చెప్పాల్సి వచ్చింది. అప్పుడు అతను టేబుల్ టెన్నిస్ను ఎంచుకున్నాడు. నిలకడైన ప్రదర్శనతో ఇప్పుడు భారత్ తరఫున టీమ్ ఈవెంట్లలో రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. ఆకుల శ్రీజ: హైదరాబాద్కు చెందిన 25 ఏళ్ల ఆకుల శ్రీజ ఇప్పుడు భారత్ తరఫున అత్యంత విజయ వంతమైన ప్లేయర్గా కొనసాగుతోంది. 2021 సీనియర్ నేషనల్స్లో రన్నరప్గా నిలిచిన శ్రీజ తర్వాతి ఏడాది మరింత మెరుగైన ప్రదర్శన కనబరచింది. 2022లో జాతీయ సీనియర్ చాంపియన్షిప్లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఆమె విజేతగా నిలిచింది. 1964లో మీర్ ఖాసిం అలీ తర్వాత హైదరాబాద్ నుంచి టీటీలో జాతీయ చాంపియన్గా నిలిచిన తొలి ప్లేయర్ శ్రీజ కావడం విశేషం. రెండేళ్ల క్రితం బర్మింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించడం ఆమె కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన. చదువులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న శ్రీజ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా పని చేస్తోంది. ప్రస్తుతం భారత నంబర్వన్గా ఉన్న ఈ అమ్మాయి ఒలింపిక్స్లో పతకమే లక్ష్యంగా సన్నద్ధమవుతోంది. రెండేళ్ల క్రితం శ్రీజ అర్జున అవార్డు కూడా గెలుచుకుంది. మనికా బత్రా: రెండేళ్ల క్రితం అర్చనా కామత్తో కలసి మనికా బత్రా ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్లో నాలుగో స్థానానికి చేరింది. ఏ విభాగంలోనైనా ఇప్పటి వరకు భారత్ తరఫున ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్. సుదీర్ఘ కాలంగా వరుస విజయాలతో భారత టేబుల్ టెన్నిస్లో తనదైన ముద్ర వేసింది. కామన్వెల్త్ క్రీడల్లో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం గెలుచుకున్న ఆమె ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించింది. ఇంట్లో సోదర, సోదరీలను చూసి టీటీ వైపు ఆసక్తి పెంచుకున్న 28 ఏళ్ల మనికా ఇప్పుడు భారత జట్టులో కీలక సభ్యురాలు. అర్జున, ఖేల్రత్న అవార్డులను అందుకున్న ఈ ఢిల్లీ ప్లేయర్కు మున్ముందు మరిన్ని ఘనతలు సాధించగల సత్తా ఉంది. ఆటతో పాటు అందం ఉన్న మనికకు మంచి బ్రాండింగ్ సంస్థల నుంచి మోడలింగ్ అవకాశాలు వచ్చినా.. టీటీపైనే దృష్టి పెట్టేందుకు వాటన్నింటినీ తిరస్కరించింది. ఐహికా ముఖర్జీ: కోల్కతా శివార్లలోని నైహతి ఐహికా స్వస్థలం. గత ఏడాది ఆసియా క్రీడల్లో మహిళల డబుల్స్లో సుతీర్థ ముఖర్జీతో కలసి ఐహికా సెమీఫైనల్కు చేరింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో గెలిచి కాంస్యం సొంతం చేసుకున్న ఈ జోడి ఆసియా క్రీడల మహిళల డబుల్స్లో భారత్కు తొలిసారి పతకాన్ని అందించింది. వరల్డ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో చైనా దిగ్గజం సున్ యింగ్షాపై సాధించిన పలు విజయాలు ఐహిక ఖాతాలో ఉన్నాయి. ఇటీవలే ఐహికకు అర్జున అవార్డు కూడా దక్కింది. దియా చిటాలే: ముంబైకి చెందిన 21 ఏళ్ల దియా చిటాలే జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ ప్రదర్శనలతో గుర్తింపులోకి వచ్చింది. అండర్–15 స్థాయి నుంచి వరుసగా కేడెట్, జూనియర్ స్థాయిలలో వేర్వేరు వయో విభాగాల్లో ఆమె విజేతగా నిలిచింది. ఆటతో పాటు రెండేళ్ల క్రితం చెలరేగిన ఒక వివాదంతో దియా వార్తల్లో నిలిచింది. 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల కోసం ఎంపిక చేసిన భారత జట్టులో తనకు చోటు దక్కకపోవడంతో దియా కోర్టును ఆశ్రయించింది. తన ప్రదర్శన, రికార్డులతో ఆమె కోర్టులో పోరాడింది. చివరకు న్యాయస్థానం ఆదేశాలతో దియాకు భారత జట్టులో స్థానం లభించడం విశేషం. అర్చనా కామత్: 23 ఏళ్ల అర్చనా కామత్ స్వస్థలం బెంగళూరు. తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. 11 ఏళ్ల వయసులో రాష్ట్రస్థాయి చాంపియన్షిప్ అండర్–12, అండర్–18 టైటిల్స్ సాధించి సంచలనం సృష్టించింది. 14 ఏళ్లకే అండర్–21లో కూడా విజేతగా నిలవడంతో మరింత గుర్తింపు లభించింది. 2018లో తొలిసారి సీనియర్ నేషనల్స్ గెలిచిన తర్వాత ఆమె వేగంగా దూసుకుపోయింది. 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడలకు ముందుగా జట్టులో ఎంపికై ఆ తర్వాత దియా చిటాలేకు వచ్చిన అనుకూల కోర్టు తీర్పుతో చోటు కోల్పోయింది. అయితే తర్వాతి ఏడాది సీనియర్ జాతీయ ర్యాంకింగ్ టోర్నీలో విజేతగా నిలిచి సత్తా చాటింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో డబుల్స్లో కొంతకాలంగా టాప్–15లో కొనసాగుతోంది. — మొహమ్మద్ అబ్దుల్ హాది ఇవి చదవండి: PSL 2024: నిరాశపరిచిన బాబర్.. ఫైనల్కు చేరిన షాదాబ్ ఖాన్ జట్టు -
‘డెడ్మ్యాన్’ రిటైర్డ్
మార్క్ విలియమ్ కాలవే.. అంటే ఎవరో తెలియకపోవచ్చు. కానీ అండర్ టేకర్ అంటే తెలియని వాళ్లు అరుదు. కొందరు ముద్దుగా డెడ్ మ్యాన్ అని కూడా పిలుచుకుంటారు. ముఖ్యంగా ‘90ల్లో పుట్టిన తరానికి, అందునా రెజ్లింగ్ ఇష్టంగా చూసేవారికి ఇది చాలా సుపరిచితమైన పేరు. అతనికి అతీత శక్తులుంటాయని, ఏడు జన్మలున్నాయని పిల్లల సర్కిల్లో రకరకాల పుకార్లు షికార్లు చేస్తుంటాయి. కెరీర్లో బరిలోకి దిగిన మ్యాచుల్లో 70 శాతం విజయాలతో వల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యుడబ్ల్యుఈ) లోనే ఎవరికీ అందనంత ఎత్తులో అగ్రస్థానంలో ఉన్నాడు. చీకట్లో చర్చి గంట శబ్దంతో, నీలి మెరుపులతో, నిప్పురవ్వలతో రింగులోకి వచ్చే తీరుతోనే ప్రత్యర్థిని బెదరగొట్టి అక్కడే సగం గెలిచేస్తాడు టేకర్. బలమైన ప్రత్యర్థి చేతిలో చావుదెబ్బలు తిని పడిపోతే ఇక అతని పని ముగిసినట్టే అని అందరూ అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా లేచి నిలబడతాడు. రెట్టించిన శక్తితో ప్రత్యర్థిపై విరుచుకుపడి మ్యాచ్ గెలుస్తాడు. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం రెజ్లింగ్కు గుడ్బై చెప్పేశాడు ఈ లెజెండ్. ఆదివారం సర్వైవర్ సిరీస్లో తాను రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. ఫేర్వెల్ సందర్భంగా డబ్ల్యుడబ్ల్యుఈ సీయీవో విన్సెంట్ మెక్మహోన్ రింగు మధ్యలోకి వచ్చి అండర్ టేకర్ రాకను ప్రకటించాడు. ఆ సమయంలో భావోద్వేగానికి గురైన మెక్మహోన్ ‘‘30 ఏళ్లుగా అందరూ కథలు కథలుగా చెప్పుకుంటున్న ఒక కెరీర్ ముగిసిపోబోతుంది. ఏదీ శాశ్వతం కాదంటారు చాలామంది. కానీ నా వరకూ అది అబద్ధం. రెజ్లింగ్పై టేకర్ వేసిన ముద్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచుంటుంది. ఈ ఆట ముఖచిత్రాన్నే మార్చివేసిన పోరాట యోధుడు అండర్ టేకర్’’ అన్నారు. ఆ వెంటనే తనకు మాత్రమే ప్రత్యేకమైన స్టైల్లో రింగులోకి ఎంటరైన టేకర్ అభిమానుల కేరింతల మధ్య మైకందుకుని ‘‘అండర్ టేకర్కు విశ్రాంతినివ్వాల్సిన సమయమొచ్చింది’’ అన్నాడు. తన మాజీ మేనేజర్ బిల్ మూడీ హాలోగ్రామ్ ప్రదర్శించి మూడీపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అండర్ టేకర్ ఇమేజ్ను నిర్మించడంలో మూడీది కీలకపాత్ర. ‘‘అది ఇంకెక్కడా దొరకదు’’ ‘‘మనం ఏదైనా సాధించినప్పుడు కేరింతలు, ఒవేషన్ రూపంలో ప్రేక్షకుల నుంచి తిరిగొచ్చే శక్తి ఇంకెక్కడా దొరకదు. బహుశా ఇందుకే కొందరు (‘ది రాక్’ లాంటివారు) రిటైరైన తర్వాత కూడా రీ ఎంట్రీ ఇస్తుంటారు. నా వరకు రెజ్లింగ్ అనేది అత్యుత్తమ క్రీడ. ప్రేక్షకులు ప్రత్యక్షంగా సినిమా చూస్తున్న అనుభూతికి లోనవుతారిక్కడ. ఆటగాళ్లలో ఉండే ఎమోషన్ కూడా చాలా ఎక్కువే. అదే సమయంలో కొన్ని హద్దులు దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. ఎంతో ఒత్తిడితో కూడుకున్న ఈ ఆటలో మా ప్రతిభకు తగినంత గుర్తింపు లభిస్తుందా? అని అప్పుడప్పుడూ ఆలోచిస్తుంటాను. నిజంగా ఈ 30 ఏళ్లు చాలా వేగంగా గడిచిపోయాయి.’’ - అండర్ టేకర్ (డబ్ల్యుడబ్ల్యుఈ రూపొందించిన డాక్యుమెంటరీలో..) ప్రకటన అనంతరం సోషల్ మీడియాలో స్పందించిన సహచర రెజ్లర్లు.. ‘‘తన జీవితంలో 30 ఏళ్లు డబ్ల్యుడబ్ల్యుఈ కి అంకితం చేసిన ఓ అత్యుత్తమ ఆటగాడికి వీడ్కోలు చెప్పాల్సిన సమయమొచ్చింది. తోటి ఆటగాడిగా రింగులో నాతో కొన్ని క్షణాలు పంచుకున్నందుకు థాంక్యూ టేకర్!’’ - జాన్ సీనా ‘‘30 ఏళ్ల క్రితం ఈ రోజున మా అందరిలాగే అరంగేట్రం చేశాడతను. నా కెరీర్ ప్రారంభంలో ఓ సాయంత్రం డ్రెసింగ్ రూములోకొచ్చి నన్ను ప్రోత్సహించేలా మాట్లాడిన మాటలు నేనెప్పటికీ మర్చిపోలేను. నీతో కలిసి రింగ్ పంచుకోవడం ఒక గౌరవం.’’ - ది రాక్ ‘‘మనిద్దరం ప్రతీ ఫార్మట్లో తలపడ్డాం. కొన్ని ప్రత్యేకానుభూతుల్ని సృష్టించుకున్నాం. రింగులో ఉన్నప్పుడు నువ్వొచ్చేముందు వినిపించే ఆ బెల్ శబ్దం నన్ను భయపెట్టేది. అయినా చివరిసారిగా దాన్ని వినేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా.’’ - షాన్ మైఖేల్స్ -
ఫెరారీకి ఏమైంది...
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా వన్ అంటే సగటు ఫార్ములా వన్ అభిమానికి టపీమని గుర్తొచ్చే పేరు ఫెరారీ.. ఇప్పటి వరకూ ఫార్ములా వన్లో 235 రేసులకు పైగా విజయాలతో మిగతా టీంలకు అందనంత ఎత్తున నిలిచిన ఈ ఇటాలియన్ టీం ప్రస్తుతం విజయాల కోసం ఎదురు చూస్తోంది. చివరి సారిగా 2007లో కిమిరైకోనెన్ను ప్రపంచ డ్రైవర్ చాంపియన్ను చేసిన ఫెరారీ తిరిగి మళ్లీ ఆ ఘనతను సాధించలేకపోయింది. ప్రస్తుతం జరుగుతున్న హైబ్రీడ్ ఎరాలో మెర్సిడెస్ ముందర మోకరిల్లింది. 90 ఏళ్ల రేసింగ్ చరిత్ర కలిగిన ఫెరారీ నేడు దారుణంగా విఫలమవుతుండడం సగటు ఫెరారీ అభిమానికే కాకుండా ఫార్ములా వన్తో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తిని బాధించే అంశం 2019 ఫార్ములా వన్ సీజన్ మొదలై ఇప్పటికే దాదాపు రెండు నెలలు కావొస్తుంది. 5 రేసులు ముగిసే సరికి మాజీ ప్రపంచ రేసింగ్ చాంపియన్ అయిన ఫెరారీ ఒక్క రేసు కూడా గెలవకపోవడాన్ని ఫెరారీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరిగిన ప్రీ సీజన్ టెస్టింగ్లో దూకుడును ప్రదర్శించిన ఫెరారీ సీజన్ ఆరంభం తరువాత మెర్సిడెస్ పేస్కు తలవంచింది. 2019 సీజన్ మొదటి గ్రాండ్ ప్రీ అయిన ఆస్ట్ర్రేలియాలో హాట్ ఫెవరెట్గా బరిలో దిగిన ఫెరారీ అంచనాలను అందుకోలేక 4, 5 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. తదుపరి జరిగిన బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ రేసులో క్వాలిఫయింగ్లో పోల్ సాధించడంతో పాటు ఫ్రంట్ రోని లాక్ చేసిన ఫెరారీ గాడిలో పడిందని అందరూ అనుకున్నారు. అయితే రేసు రోజున ఇంజన్లో తలెత్తిన సాంకేతిక లోపంతో గెలవాల్సిన రేసును ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెరిక్ మూడో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అదే రేసులో రెండో స్థానం నుంచి మొదలు పెట్టిన మరో ఫెరారీ డ్రైవర్, మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ చేసిన చిన్న పొరపాటు వలన 5వ స్థానంతో ముగించాడు. అదే విధంగా మూడో రేసైన చైనా గ్రాండ్ ప్రీలో మెర్సిడెస్కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది. పని చేయని అప్గ్రేడ్స్ చైనా రేసులో అంచనాలను అందుకోలేక పోయిన ఫెరారీ తదుపరి రేసు అయిన అజర్బైజాన్ గ్రాండ్ ప్రీ కోసం ఫ్రంట్ వింగ్ అప్గ్రేడ్స్తో ముందుకొచ్చింది. అయినా ఫెరారీ దురదృష్టంలో ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో స్పానిష్ గ్రాండ్ ప్రీ కోసం ఇంజన్ అప్గ్రేడ్ చేసినా ఫెరారీ అభిమానులకు మాత్రం నిరాశే మిగిలింది. డిజైన్ కాన్సెప్ట్లో తప్పుంది 2019 సీజన్ కారు అయినటువంటి ఎస్ఎఫ్-90ఎచ్ కారు డిజైన్ కాన్సెప్ట్లో తప్పుందని టీం ప్రిన్సిపల్ మాటియా బినొట్టో స్పానిష్ గ్రాండ్ ప్రీ రేసు అనంతరం వ్యాఖ్యానించారు. కార్నర్స్లో మెర్సిడెస్, రెడ్బుల్ కార్ల కంటే వేగంగా వెళ్లలేకపోతున్నామని, అయితే స్ట్నేయిట్ లైన్ స్పీడులో మా ఇంజిన్ అద్భుతంగా పని చేస్తోందని ఆయన అన్నారు. అయితే 2016 సీజన్ మాదిరే ఈ సీజన్ కూడా ఫెరారీ ఒక్క విజయం నమోదు చేయకుండానే ముగిస్తుందేమోననే ఆందోళనలో ఫెరారీ అభిమానులున్నారు. -
ఫైనల్లో పీవీ సింధుపై సైనా గెలుపు
జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేతగా సైనా నెహ్వాల్ నిలిచారు. ఫైనల్లో పీవీ సింధుపై సైనా గెలుపొందారు. 21-18, 21-15 తేడాతో పీవీ సింధుపై సైనా విజయం సాధించారు. వరుసగా రెండో ఏడాది సింధుపై సైనా గెలిచారు. ఈ విజయంతో నాలుగోసారి జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్గా సైనా నిలిచారు. -
2032 ఒలింపిక్స్ రేసులో ఉభయ కొరియాలు
సియోల్: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ను ఉమ్మడిగా నిర్వహించేందుకు తాము సిద్ధం అంటున్నాయి దాయాది దేశాలైన ఉత్తర, దక్షిణ కొరియా. తమ రాజధానులు ప్యాంగ్యాంగ్, సియోల్లలో 2032 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చే యోచనలో ఉన్నాయి. ఈ మేరకు శుక్రవారం స్విట్జర్లాండ్లో సమావేశం కానున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి సమాచారం ఇవ్వనున్నాయి. 2018లోదక్షిణ కొరియాలోని పియాంగ్చాంగ్లో జరిగిన శీతాకాల ఒలింపిక్స్కు ఉత్తర కొరియా తమ జట్లను పంపడంతో రెండు దేశాల మధ్య క్రీడా సంబంధాలు మెరుగుపడ్డాయి. మరోవైపు తమ ద్వీపకల్పంలో ఉద్రిక్తతల నివారణ, శాంతి స్థాపనకు దోహదపడుతుందని భావించి ఉమ్మడి ఆతిథ్యం పట్ల దక్షిణ కొరియా చొరవ చూపింది. గతేడాది రెండు దేశాల అంతర్గత చర్చల్లో ఆ ప్రస్తావన తెచ్చింది. గతంలో దక్షిణ కొరియా 1988లో సియో ల్లో ఒలింపిక్స్ నిర్వహించింది. ఉత్తర కొరియా వాటిని బహిష్కరించింది. అయితే, ఉత్తర కొరియా రాజకీయ, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడి బిడ్ నెగ్గడం కష్టమే.
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
IPL 2024: సీఎస్కేను చిత్తు చేసిన పంజాబ్.. ఘనమైన రికార్డు
గోల్డ్ స్పాట్ కుటుంబం.. గోల్మాల్ ‘గీతం’
మళ్లీ జగన్ రావాలి
చంద్రబాబుపై నమ్మకం లేకే ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ నో
జేబీ పౌడర్తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లు
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్!
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్కు ఇస్తారట!
ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
చంద్రబాబు మేనిఫెస్టోపై పోసాని అదిరిపోయే సెటైర్లు..
Photos
View allVideo
View allతప్పక చదవండి
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- ‘కింగ్స్’ పోరులో పంజాబ్దే గెలుపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
Advertisement