ఇంగ్లండ్‌దే సిరీస్‌

ఇంగ్లండ్‌దే సిరీస్‌


మూడో టెస్టులో విండీస్‌పై విజయం  



లార్డ్స్‌: జేమ్స్‌ అండర్సన్‌ ఇన్నింగ్స్‌లో తన కెరీర్‌ ఉత్తమ బౌలింగ్‌ (7/42) గణాంకాలతో చెలరేగడంతో వెస్టిండీస్‌తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌ను ఆతిథ్య జట్టు 2–1తో దక్కించుకుంది. శనివారం మూడో రోజు విండీస్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 65.1 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. రెండో రోజు ఆటలో టెస్టుల్లో 500 వికెట్లు పూర్తి చేసుకున్న అండర్సన్‌ మూడో రోజు మరింత జోరును కనబరచడంతో విండీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పేకమేడలా కూలింది. హోప్‌ (62), పావెల్‌ (45) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టానికి 28 ఓవర్లలో 107 పరుగులు చేసి గెలిచింది. స్టోన్‌మన్‌ (40 నాటౌట్‌), వెస్టీ›్ల (44 నాటౌట్‌) రాణించారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top