జింఖానా, న్యూస్లైన్ : ఫాదర్ బాలయ్య స్మారక క్రీడల్లో భాగంగా జరిగిన బాస్కెట్బాల్ టోర్నమెంట్లో చెన్నై లయోలా జట్టు విజేతగా నిలిచింది. లయోలా కాలేజిలో బుధవారం జరిగిన ఫైనల్లో చెన్నై లయోలా 80-65తో లయోలా అకాడమీ (హైదరాబాద్)పై గెలిచింది. ఆట ప్రారంభంలో చెన్నై లయోలా కాస్త దూకుడు ప్రదర్శించినప్పటికీ... లయోలా అకాడమీ ఆటగాళ్లు గణేశ్, ఉదయ్, డేవిడ్ ప్రతిఘటించారు. అయినా మ్యాచ్ ప్రథమార్ధం ముగిసే సమయానికి 35-32తో చెన్నై లయోలా ముందంజలో నిలిచింది.
అనంతరం విజృంభించిన చెన్నై లయోలా ఆటగాళ్లు కార్తికేయన్ (23), ఆంటో (23) చక్కటి ఆటతీరుతో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా జట్టును ముందంజలో ఉంచేందుకు దోహదపడ్డారు. చివరి వరకు లయోలా అకాడమీ క్రీడాకారులు జోస్ (15), చంద్రహాస్ (14) ఎదుర్కునేందుకు ప్రయత్నించిన ప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో లయోలా అకాడమీ రన్నరప్తో సరిపెట్టుకుంది. అనంతరం మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన మ్యాచ్లో ఏవీ కాలేజి 56-45తో సెయింట్ మార్టిన్స్పై గెలుపొందింది.
సాక్రెడ్ హార్ట్కు వాలీబాల్ టైటిల్
వాలీబాల్ ఫైనల్లో సాక్రెడ్ హార్ట్ (తిరుపత్తూర్) జట్టు 25-22, 25-21, 21-25, 25-20తో జమాల్ మహ్మద్ (తిరుచ్చి) జట్టుపై విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో జమాల్ మహ్మద్ జట్టు నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ సాక్రెడ్ హార్ట్ జట్టు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే మూడో సెట్లో జమాల్ మహ్మద్ ఆటగాళ్లు సాక్రెడ్ హార్ట్ జట్టును కంగుతినిపించారు.
అనంతరం నాలుగో సెట్లో తేరుకున్న సాక్రెడ్ హార్ట్ చాకచక్యంగా వ్యవహరించి టైటిల్ను దక్కించుకుంది. తర్వాత మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన పోటీలో లయోలా అకాడమీ 24-25, 18-25, 19-25, 25-15, 15-10తో ఆంధ్రా లయోలా కాలేజిపై గెలిచింది. విజేతలకు గ్రేట్ స్పోర్ట్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్. అనిల్ కుమార్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ సంఘం కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
విజేత చెన్నై లయోలా
Published Thu, Feb 13 2014 12:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అధికారం వెంటే నేతలు..!
పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
వాల్మీకులు కాంగ్రెస్ వెంటే..
మోసపూరిత హామీలు నమ్మొద్దు
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
రామాయణ కారిడార్ అనుసంధానం చేయాలి
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
కాంగ్రెస్ గూటికి మున్సిపల్ వైస్ చైర్మన్
రఘురాముడు గెలిస్తే అభివృద్ధి..
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement