శ్యామ్ పసిడి పంచ్ | Sakshi
Sakshi News home page

శ్యామ్ పసిడి పంచ్

Published Thu, Apr 9 2015 1:37 AM

Boxer kakara Shyam Kumar won the gold medal

న్యూఢిల్లీ : థాయ్‌లాండ్ అంతర్జాతీయ ఆహ్వానిత బాక్సింగ్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్‌కుమార్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. థాయ్‌లాండ్‌లోని పట్టాయా పట్టణంలో జరిగిన ఈ టోర్నీలో వైజాగ్ బాక్సర్ శ్యామ్ 49 కేజీల విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్లో శ్యామ్ 3-0 తేడాతో సురాజిత్ థోంగ్ ఆనంద్ (థాయ్‌లాండ్)పై గెలిచాడు. భారత్‌కే చెందిన రోహిత్ (60 కేజీలు), మంజిత్ (69 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు గెలిచారు.

Advertisement
Advertisement