ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో అమిత్‌కు రజతం | Amit Kumar wins silver in World Para Athletics Championships | Sakshi
Sakshi News home page

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో అమిత్‌కు రజతం

Jul 18 2017 1:27 AM | Updated on Sep 5 2017 4:15 PM

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో  అమిత్‌కు రజతం

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో అమిత్‌కు రజతం

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్‌ అమిత్‌ కుమార్‌ సరోహ రజత పతకం సాధించాడు. పురుషుల క్లబ్‌ త్రో ఎఫ్‌51 పోటీల్లో అతను 30.25 మీటర్లతో రెండో స్థానంలో నిలిచాడు.

లండన్‌: ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్‌ అమిత్‌ కుమార్‌ సరోహ రజత పతకం సాధించాడు. పురుషుల క్లబ్‌ త్రో ఎఫ్‌51 పోటీల్లో అతను 30.25 మీటర్లతో రెండో స్థానంలో నిలిచాడు. తన మూడో ప్రయత్నంలో ఈ ప్రదర్శన చేయడం ద్వారా అమిత్‌ కొత్త ఆసియా రికార్డును నమోదు చేశాడు. ఈ ఈవెంట్‌లో జెల్జ్‌కో (సెర్బియా; 31.99 మీ.) ప్రపంచ రికార్డు నెలకొల్పి బంగారు పతకం నెగ్గాడు. భారత్‌కే చెందిన ధరంబిర్‌ (22.34 మీ.) పదో స్థానంలో నిలిచాడు. అమిత్‌ కుమార్‌ నేడు (మంగళవారం) డిస్కస్‌ త్రో ఎఫ్‌52 ఈవెంట్‌లో కూడా పోటీపడనున్నాడు. ఈ టోర్నీలో భారత్‌కు చెందిన సుందర్‌ సింగ్‌ గుర్జర్‌ జావెలిన్‌ త్రో ఎఫ్‌46లో బంగారు పతకం గెలిచిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement