ప్రకాశం: వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి మాటలు నీచాతినీచంగా ఉన్నాయని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి విమర్శించారు. శనివారం వైవీ విలేకరులతో మాట్లాడుతూ.. బిడ్డ కోసం లండన్ వెళ్లినా రాజకీయం చేయడం చంద్రబాబు, ఆయన భజన పరులకే చెల్లిందన్నారు. ఓటర్ల నమోదు, తొలగింపులో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.
వైఎస్సార్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తొలగించిన వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తిరిగి నమోదు అయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల కోసం, ఓట్ల కోసం చంద్రబాబు కొత్తపథకాలు ప్రవేశపెడుతున్నారని విమర్శించారు. ఎన్నికలకు రెండు నెలల ముందు చంద్రబాబు చేస్తున్న గిమ్మిక్కులను ప్రజల గమనిస్తున్నారని, ప్రజలేం పిచ్చోళ్లు కాదని, చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ అద్భుతమని బీసీ మేధావులు కొనియాడుతున్నారని చెప్పారు. తాను మళ్లీ ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేస్తానని వెల్లడించారు. పార్టీ, ప్రజల ఆశీర్వాదంతో 2019లో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా అఖండ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో మా పార్టీ చేతిలో ఓడిపోయిన వ్యక్తులకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పార్టీలోకి వస్తామంటే ఎవరికీ అడ్డుచెప్పబోమని స్పష్టం చేశారు.
చంద్రబాబు మాటలు నీచాతినీచం: వైవీ
Published Sat, Feb 23 2019 4:53 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement