సాక్షి, ద్వారకాతిరుమల : ఓటమి భయంతో టీడీపీ నేతలు బరితెగించారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుకు పెరుగుతున్న జనాభిమానాన్ని చూసి ఓర్వలేక ఆయన ప్రచారాన్ని అడ్డుకున్నారు. అసభ్య పదజాలంతో దూషించారు. న్యూస్ కవరేజ్కు వెళ్లిన సాక్షి మీడియాపై సైతం టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించారు. ద్వారకాతిరుమల మండలంలోని పలు గ్రామాల్లో ఉదయం నుంచి వైఎస్సార్ సీపీ నేతలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తలారి వెంకట్రావుకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది చూసి ఓర్వలేక.. వైఎస్సార్సీపీ ప్రచారాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ఎం.నాగులపల్లిలో బుధవారం సాయంత్రం తలారిని అడ్డుకున్నారు.
ఉద్దేశపూర్వకంగా బైక్ అడ్డుపెట్టి..
తలారి ప్రచార రథం ఎం.నాగులపల్లికి చేరగానే టీడీపీ నేతలు ఒక బైక్ను రోడ్డుకు అడ్డంగా నిలిపారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్త బైక్కు ఉన్న జెండా కర్ర, టీడీపీ నేత బైక్కు తగిలింది. దీంతో టీడీపీ నేత ఇష్టానుసారం బూతులు తిడుతూ వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడిచేశాడు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా తలారి వాహనాన్ని అడ్డుకున్నారు. ఒక దళిత ఎమ్మెల్యే అభ్యర్థి అని కూడా చూడకుండా తలారిని ఇష్టానుసారం దూషించారు. తలారిని నిర్బంధించి ఆయన కారును సైతం ధ్వంసం చేశారు. వైఎస్సార్ సీపీ శ్రేణులను, అక్కడకు చేరుకున్న ప్రజలను, మీడియా వారిని భయబ్రాంతులకు గురిచేసేలా టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రవిప్రకాష్ పలువురు డీఎస్పీలు, సీఐలను సంఘటనా స్థలానికి పంపించారు.
వారి ఆధ్వర్యంలో భీమడోలు సీఐ సీహెచ్ కొండలరావు, స్థానిక పోలీసులు గొడవ సద్దుమణిగేలా చేశారు. నిర్భంధంలో ఉన్న తలారిని, వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను విడిపించారు. అంతకుముందు న్యూస్ కవరేజ్ నిమిత్తం అక్కడకు వెళ్లిన సాక్షి దినపత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా విలేకర్లపై కూడా టీడీపీ శ్రేణులు దౌర్జన్యం చేయడంతో పాటు దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా గ్రామంలో ప్రత్యేక దళాలను మోహరించారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం గోపాలపురం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమీ లేకపోగా, ఆ పార్టీ నేతలు చేసిన అక్రమాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ప్రచారానికి వెళుతున్న ముప్పిడిని ప్రజలు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. దీంతో తలారి ప్రచారాన్ని అడ్డుకోవాలని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. తలారి ప్రచారాన్ని కూడా ప్రజలు అడ్డుకుంటున్నారని చూపే ఎత్తుగడతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
టీడీపీ శ్రేణుల దౌర్జన్యం
Published Thu, Apr 4 2019 11:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement