చర్చకొచ్చారా? రచ్చకొచ్చారా? | srinivas goud commented over congress | Sakshi
Sakshi News home page

చర్చకొచ్చారా? రచ్చకొచ్చారా?

Oct 28 2017 2:06 AM | Updated on Mar 18 2019 9:02 PM

srinivas goud commented over congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీలో ప్రతీ అంశంపై ఎంతసేపైనా చర్చిద్దామని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ కాంగ్రెస్‌ సభ్యులు సభను అడ్డుకోవాలన్న కుట్రతోనే వచ్చారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌ గౌడ్, ఎ.జీవన్‌రెడ్డి మాట్లాడారు.

సభలో వీరు చర్చ చేయడానికొచ్చారా లేక రచ్చ చేసేందుకొచ్చారా అని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను లక్ష్యపెట్టలేదని, కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంపై ఏనాడైనా ధ్యాస పెట్టారా అని శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రశ్నిం చారు. సభలో మాట్లాడడానికి విషయం లేక రైతుల పేరుతో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

మాదక ద్రవ్యాలపై తాను వేసిన ప్రశ్న చర్చకొచ్చే సమయానికి సభను వాయిదా వేశారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణను జీవన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌ నేతలు రచ్చ చేయడానికి కాకుండా చర్చ చేయడానికి సభకు హాజరు కావాలని హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement