జోన్ల వ్యవస్థ తొందరపాటు నిర్ణయం | Kodandaram Comment On Zonal System | Sakshi
Sakshi News home page

జోన్ల వ్యవస్థ తొందరపాటు నిర్ణయం

May 25 2018 12:12 PM | Updated on May 25 2018 12:13 PM

Kodandaram Comment On Zonal System - Sakshi

కోదండరాం (ఫైల్‌ ఫోటో)

సాక్షి, సంగారెడ్డి: కంది మండలం కేంద్రంలో తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం శుక్రవారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ... రాష్ట్రంలో జోన్ల వ్యవస్థ తొందరపాట నిర్ణయమన్నారు. ప్రభుత్వం అనాలోచితంగా అలోచించి జోన్ల వ్యవస్థను తీసుకువచ్చిందని విమర్శించారు. జోన్ల వ్యవస్థపై అధికారుల నివేదికను బహిర్గతం చేయాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను వెంటనే తగ్గించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గిస్తే వినియోగదారుల మీద భారం తగ్గుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీజేఎస్‌ పార్టీని బలోపేతం చేస్తామని, రానున్న సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement