మిడతల్లా మాడిపోతారు | Dasoju sravan kumar commented over kcr | Sakshi
Sakshi News home page

మిడతల్లా మాడిపోతారు

Mar 18 2018 2:28 AM | Updated on Aug 15 2018 9:04 PM

Dasoju sravan kumar commented over kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏం జరుగుతోందన్న దానిపై ప్రజలు వాస్తవం గ్రహిస్తే కేసీఆర్, ఆ పార్టీ నేతలు ప్రజల ఆగ్రహానికి మిడతల్లా మాడిపోతారని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కుమార్‌ మండిపడ్డారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసినవి రైతు సమన్వయ సమితులు కావని, రాజకీయ సమన్వయ సమితులని పేర్కొన్నారు. అసమర్థతతో రైతులకు మద్దతు కల్పించకుండా ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టి గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని లేఖలో ఆరోపించారు. రైతు సమస్యలు, ఆత్మహత్యల గురించి మాట్లాడకుండా జాతీయ రాజకీయాలు తెరమీదకి తెచ్చి హంగామా చేయడం మీకు అలవాటని కేసీఆర్‌ను ఎద్దేవా చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement