‘కబ్జాకోరునని నిరూపిస్తే రాజకీయాల్లో ఉండను’

Danam Nagendra challenge to Uttam Kumar Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భూ కబ్జాలకు తాను పాల్పడినట్టుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని టీఆర్‌ఎస్‌ నేత దానం నాగేందర్‌ అన్నారు. తనపై ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు.

మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఉత్తమ్‌కు గాంధీభవన్‌లో ఏ గౌరవమూ లేదని, ఢిల్లీలో డబ్బులిచ్చి పదవిని కాపాడుకుంటున్నారన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. డబ్బులకు అమ్ముడుపోయినట్టుగా తనపై వ్యాఖ్యలు చేసిన ఉత్తమ్‌ కారులోనే డబ్బులు దొరికాయని.. అప్పుడు ఎవరికి అమ్ముడుపోయి డబ్బులు తెచ్చారో చెప్పాలన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top