తినడానికి తిండి లేదు కానీ స్మార్ట్‌ ఫోనా?

CPI Leader Ramakrishna Fires on CM Chandrababu Naidu - Sakshi

చంద్రబాబుపై సీపీఐ నేత రామకృష్ణ 

సాక్షి, విజయవాడ : తినడానికి తిండి లేకున్నా.. వాడుకోవడానికి స్మార్ట్‌ ఫోన్‌లు ఇస్తున్నారంటూ సీఎం చంద్రబాబు నాయుడిపై సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరుగురి సభ్యులకు రాజ్యసభ పదవులు ఇచ్చారని, కానీ వారిలో ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ లేరన్నారు. అందరూ అగ్రకులస్తులేనని తెలిపారు. కర్నూల్‌లో కోట్ల కుటుంబం సీఎం చంద్రబాబును అర్థరాత్రి కలవడం.. అదేంటయ్యా అంటే భోజనానికి అని బుకాయిస్తూ, ప్రాజెక్టుల కోసమని చెబుతారని, కానీ కోట్ల అడిగిని ప్రాజెక్టులు.. రెండు ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటని అందరికి తెలుసన్నారు. జనసేన, వామపక్షాలు కలిసి ఎన్నికలకి వెళ్తాయని, సీట్ల సర్దుబాటును త్వరలోనే తేలుస్తామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top