ఏలూరు (మెట్రో)/ఏలూరు టౌన్: వ్యవసాయ రంగాన్ని కేంద్రం నాశనం చేస్తుంటే తాను ప్రశ్నించానని సీఎం చంద్రబాబు అన్నారు. రైతులను ఆదుకునేందుకు ఎంతదూరమైనా వెళ్తానన్నారు. పశ్చిమగోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) శత వార్షికోత్సవంలో భాగంగా ఏలూరు ఇండోర్ స్టేడియంలో మంగళవారం ప్రత్యేకంగా నిర్వహించిన రైతుల సభలో సీఎం మాట్లాడారు. రైతు ఆదాయం రెండింతలు అభివృద్ధి చేస్తానని మోదీ చెప్పినప్పటికీ అది సాధ్యం కాలేదనీ, తాను మాత్రం 11 శాతం అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రైతులకు లబ్ధి చేకూర్చే స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మాటేమిటని కేంద్రాన్ని ప్రశ్నించానన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సాగునీటికి, ఎరువులకు కొరత లేకుండా చూశామని చెప్పారు.
రైతు రుణమాఫీ విషయంలో ధైర్యంగా తాను ముందడుగు వేస్తే మోదీ మాత్రం ఇవ్వలేనని చేతులెత్తేశారన్నారు. ప్రధాని మాటలకు చేతలకు పొంతన లేకుండా పోతోందన్నారు. అలాగే, వ్యవసాయంలో ఉపాధి హామీ పథకం (నరేగా)ను అమలుచేయాలని తాను కోరిన ఫలితంగానే కేంద్రం కమిటీ వేసిందని సీఎం చెప్పారు. ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వనంటోందని, మోసం చేస్తోందని, అయినా సాధించుకుంటామని చెప్పారు. ప్రతిపక్షాన్ని బీజేపీ ఆటలాడిస్తోందని, పవన్కళ్యాణ్ను తనపైకి ఉసిగొల్పుతోందని మండిపడ్డారు. గతంలో తన పాట పాడిన పవన్కళ్యాణ్ ప్రస్తుతం బీజేపీ పాట పాడుతున్నారన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పేందుకు కేంద్రం అడ్డుతగులుతోందన్నారు. కనీసం తాను నిర్మాణం చేస్తానన్నా సహకరించట్లేదన్నారు. కాగా, ఏలూరులోని జిల్లా ప్రభుత్వాసుపత్రి రెడ్క్రాస్ భవనంలో తలసేమియా, హిమోఫీలియా వ్యాధిగ్రస్తుల చికిత్సా భవనాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు పూర్తిస్థాయిలో ఔషధాలను సమకూర్చడంతోపాటు నెలకు రూ.2 వేలు పెన్షన్గా అందిస్తామని చెప్పారు.
గేట్లు వేసి.. రైతులను బంధించి..
ఇదిలా ఉంటే.. రైతుల సభకు హాజరైన వారిని బయటకు వెళ్లకుండా పోలీసులు గేట్లు వేసి బంధించడం విమర్శలకు తావిచ్చింది. సభకు జిల్లావ్యాప్తంగా వెయ్యిమందికి పైగా రైతులు, మహిళలు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం మ.1.30 గంటలకు ప్రారంభమవ్వాల్సిన సభ గంటన్నర ఆలస్యంగా మొదలైంది. తదుపరి టీడీపీ ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రసంగాలు కొనసా..గాయి. దీంతో రైతులు సభాప్రాంగణం నుంచి బయటకు వెళ్లిపోవటం మొదలెట్టారు. 3.45కు సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని ప్రారంభించగానే రైతులు భారీసంఖ్యలో బయటకు వెళ్లిపోసాగారు. గమనించిన పోలీసు అధికారులు గేట్లు వేసేసి.. రైతులు బయటకు పోకుండా అడ్డుకున్నారు. దీంతో మమ్మల్ని బయటకు వెళ్లనీయండి బాబోయ్ అని రైతులు గగ్గోలు పెట్టారు. ఇలా బంధించి ఇబ్బంది పెడితే ఎలాగని అసహనం వ్యక్తంచేశారు. నినాదాలకు దిగారు. పరిస్థితి విషమించటంతో పోలీసులు గేట్లు తీయగా రైతులు, మహిళలు బయటకు పరుగులు తీశారు.
టీడీపీలో చేరండి : అశోక్బాబుకు సీఎం ఆదేశం
ఇదిలా ఉంటే.. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబును తమ పార్టీలో చేరాల్సిందిగా సీఎం చంద్రబాబునాయుడు మరోసారి ఆహ్వానించారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం మంగళవారం ఏలూరులో జిల్లా ఎన్జీఓ హోంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగుల తరఫున పోరాటాలు చేస్తున్న అశోక్బాబు ప్రజలకు సేవచేయడం ఎంతో అవసరమన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని అశోక్బాబును ఎప్పుడో కోరానని.. ఈ మేరకు ఎప్పుడో పార్టీలోకి రమ్మన్నానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పోటీచేయాలని అశోక్బాబును సీఎం కోరారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పిస్తున్నానని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.
‘రైతుల ఆదాయం పెంచా’
Published Wed, Jul 4 2018 4:08 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement