మంత్రి సోమిరెడ్డిని నిలదీసిన రైతులు | Angry Farmers Ask For Loan Waiver Which Was Promised By CM | Sakshi
Sakshi News home page

మంత్రి సోమిరెడ్డిని నిలదీసిన రైతులు

Aug 8 2018 4:15 PM | Updated on Aug 8 2018 4:15 PM

Angry Farmers Ask For Loan Waiver Which Was Promised By CM - Sakshi

రైతు ముఖాముఖిలో మంత్రి సోమిరెడ్డి

సాక్షి, వైఎస్సార్‌ కడప : ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రామాపురం గ్రామంలో మంత్రి రైతు ముఖాముఖిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి హాజరైన రైతులు, 2013లో తాము తీసుకున్న రుణం ఇంతవరకూ మాఫీ కాలేదని మంత్రిని నిలదీశారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం వల్లే టీడీపీకి ఓట్లేశామన్నారు.

దీంతో నష్టనివారణకు దిగిన మంత్రి వచ్చే ఎనిమిది నెలల్లో రుణమాఫీ 4, 5 విడతలు జరుగుతాయని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన రైతులు ఉద్యాన పంటలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని, ఏడు గంటల నిరంతర విద్యుత్ అందించాలని మంత్రికి విన్నవించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement