గురుపూజోత్సవాన్ని సార్థకం చేసుకుంటున్నామా? | Professor Radhakrishnan became the celebration of the birth of the teacher's | Sakshi
Sakshi News home page

గురుపూజోత్సవాన్ని సార్థకం చేసుకుంటున్నామా?

Sep 4 2015 12:10 AM | Updated on Sep 3 2017 8:41 AM

గురుపూజోత్సవాన్ని సార్థకం చేసుకుంటున్నామా?

గురుపూజోత్సవాన్ని సార్థకం చేసుకుంటున్నామా?

ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజునే ఉపాధ్యాయ దినో త్సవ దినంగా జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయ వృత్తి నుంచి రాయబారిగా....

ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజునే ఉపాధ్యాయ దినో త్సవ దినంగా జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయ వృత్తి నుంచి రాయబారిగా, ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఎదిగి, ఆ పదవులకే వన్నెతెచ్చారు రాధాకృష్ణన్ (సెప్టెంబర్ 5, 1888-ఏప్రిల్ 17, 1975). ఉపాధ్యాయుడిగా విద్యావేత్తగా, దేశాధినేతగా, తత్వవే త్తగా, రచయితగా, వక్తగా బహుముఖ వ్యక్తిత్వం ఆయనది. అం దుకే ఉపాధ్యాయ వర్గానికి ఆయనొక మానవీయ సంకేత మయ్యారు.

విద్యాభ్యాసం తరువాత రాధాకృష్ణన్ 1908లో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో తత్వశాఖలో సహాచార్యులయ్యారు. 1909 నుంచి ప్రధానాచార్యులయ్యారు. భగవద్గీత, బౌద్ధతత్వం, జైనతత్వం, సాంఖ్య యోగ, మీమాంస, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యుల వ్యాఖ్యానాలపై విశేషంగా అధ్యయనం చేసి, వ్యాఖ్యానించారు. ప్లేటో, కెంట్, బ్రాడ్లీ, బెర్గ్‌సన్ లాంటి ఉత్తమ పాశ్చాత్య తాత్వికుల వాదనలన్నింటినీ సహేతు కంగా చర్చించి క్రోడీకరించి ‘ద రెయిన్ ఆఫ్ రెలిజియన్ ఇన్ కాంటెంపరరీ ఫిలా సఫీ’ అనే గ్రంథాన్ని రాశారు. అమెరికన్ ప్రొఫెసర్ ‘‘హిన్‌మాన్’’ ఈ గ్రంథాన్ని ఎంతగానో మెచ్చుకుని రాధాకృష్ణన్‌ను అమెరికన్ తత్వవేత్త ‘బోసాన్‌క్వెట్’తో పోల్చారు. అదే అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో పాఠ్యగ్రంథమైంది. ‘ది క్వెస్ట్’, ‘ది మోనిస్ట్’, ‘ది మైండ్’, ‘జనరల్ ఆఫ్ ఫిలాసఫీ’, ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎథిక్స్’ లాంటి అంతర్జాతీయ పత్రికల్లో తత్వశాస్త్రంపై వ్యాసాలు రాశారు. తను రాసిన భగవద్గీత వ్యాఖ్యానాన్ని గాంధీజీకి అంకితమిచ్చారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వంలోని ఫిలాసఫీని గ్రంథస్థం చేశారు. ‘‘ది ఫ్యూచర్ ఆఫ్ సివిలైజేషన్’’, ‘‘ఇండియన్ ఫిలాసఫీ’’ రచిం చారు. బ్రహ్మసూత్రాలను ఇంగ్లిష్‌లోకి అనువదించారు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో పని చేసిన తరువాత 1916లో మైసూరు మహా రాజా కాలేజీలో తత్వశాఖాధ్యక్షులుగా చేరారు. 1921లో కల కత్తా విశ్వవిద్యాలయంలో చేరారు. కాశీ విశ్వవిద్యాలయానికి, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్స్‌లర్‌గా పని చేశారు.  కాలేజీ లలోను, యూనివర్సిటీలలోనూ ఆయన పని చేసినంత కాలం విద్యార్థులలో క్రమశిక్షణ, విద్యాలయ వ్యవహారాల్లో సమర్థత కనిపించేది. విద్యార్థు లను రాజకీయాలకు దూరంగా ఉంచేవారు. రష్యాలో భారత రాయబారిగా నియమితులైన రాధాకృష్ణన్‌ను నాటి రష్యా పాలకుడు జోసెఫ్ స్టాలిన్ సయితం కలుసుకోవడం ప్రత్యేకంగా చెబుతారు. స్టాలిన్ సాధారణంగా రాయబారులను కలుసుకునేవారు కాదని ప్రతీతి. ఇలాంటి అరుదైన గౌరవాలు ఎన్నో ఆయనకు దక్కాయి. స్వయంకృషితో ఎదిగిన అసమాన ప్రతిభావంతుడు, అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన తత్వవేత్త రాధాకృష్ణన్ జీవితం భారతీయులందరికీ  మార్గదర్శకం.

(సెప్టెంబర్ 5 గురుపూజోత్సవం) మొగుళ్ల కృష్ణారెడ్డి  రామంతాపూర్, మొబైల్: 97015 47528

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement