Sakshi News home page

40 రోజుల్లో నవజీవం..!

Published Sun, Mar 16 2014 11:37 PM

new life in fourt hy days

 రసాయనిక వ్యవసాయం వల్ల నిస్సారమైన భూమిలో తిరిగి జీవశక్తిని నింపడానికి ఉపయోగపడే ఒక సహజ పద్ధతి ‘రామబాణం’. అందుబాటులో ఉన్న వనరులతోనే రైతులు పొలంలో దీన్ని సులభంగా అమలు చేయవచ్చు. వరుసగా రెండు పంటలకు ముందుగా ఈ పద్ధతిని అమలు చేస్తే.. ఆ భూమి పూర్తిగా సారవంతమవుతుందని ‘రామబాణం’ రూపకర్త        డా. పత్తిపాటి రామయ్య చెప్పారు..
 
 1వ రోజు: ఎకరం భూమిని ఎద్దులతో దున్నించాలి.
 
 2వ రోజు: ఉదయం 6 గం.కు- రెండుంపావు కిలోల అల్లం రుబ్బి 4 లీటర్ల నీటితో కుండలో కలిపి భూమిలో పాతిపెట్టాలి.
 
 9వ రోజు: ఉదయం 6 గంటలకు- 4 కిలోల నాటు ఆవు పేడను 6 లీటర్ల నీటితో కుండలో కలిపి భూమిలో పాతిపెట్టాలి.  సాయంత్రం 6 గంటలకు- మురిగిన అల్లం ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో చల్లాలి.
 
 14వ రోజు: సాయంత్రం 6 గంటలకు- మురిగిన పేడ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో చల్లాలి.
 
 17వ రోజు: ఉదయం 6 గంటలకు- 8 కిలోల బెల్లం 12 లీటర్ల నీటితో కుండలో కలిపి భూమిలో పాతిపెట్టాలి.
 
 19వ రోజు: సాయంత్రం 6 గంటలకు- 3 లీటర్ల నాటు ఆవు మూత్రాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో చల్లాలి.
 
 22వ రోజు: ఉదయం 6 గంటలకు- కుండలో 4 లీటర్ల నీటితో రెండుంపావు (2.25) కిలోల ఇంగువ కలిపి పాతిపెట్టాలి.
 
 24వ రోజు: సాయంత్రం 6 గంటలకు- మురిగిన బెల్లం ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో చల్లాలి.
 
 27వ రోజు: ఉదయం 6 గంటలకు- 4 కిలోల మంచి శనగపిండిని కుండలో 1 లీటరు నీటితో కలిపి పాతి పెట్టాలి.
 
 29వ రోజు: సాయంత్రం 6 గంటలకు- మురిగిన ఇంగువ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో చల్లాలి.
 
 34వ రోజు: సాయంత్రం 6 గంటలకు- మురిగిన మంచి శనగపిండి ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి.
 
 36వ రోజు: ఉదయం 6 గంటలకు- ఒకటిన్నర (1.5) లీటర్ల నాటు ఆవు పెరుగులో ఒకటిన్నర (1.5) లీటర్ల నీటిని కుండలో కలిపి మజ్జిగ చేసి భూమిలో పాతి పెట్టాలి.
 
 40వ రోజు: సాయంత్రం 6 గంటలకు- మురిగిన మజ్జిగను 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో చల్లాలి.
 
 ప్రకృతి వ్యవసాయం, ‘రామబాణం’పై ఆసక్తి కలిగిన రైతులు సంప్రదించాల్సిన చిరునామా: డా. కె.గంగాధరం (098490 59573), వర్డ్ ప్రకృతి వ్యవసాయ పాఠశాల, చెంచురాజు కండ్రిగ, పిచ్చాటూరు మండలం, చిత్తూరు జిల్లా.
 

 

Advertisement

What’s your opinion

Advertisement