వారంతా ఏమయ్యారో? | we felt a sudden jerk and fell: Stranded Passenger | Sakshi
Sakshi News home page

వారంతా ఏమయ్యారో?

Nov 20 2016 10:04 AM | Updated on Sep 4 2017 8:38 PM

వారంతా ఏమయ్యారో?

వారంతా ఏమయ్యారో?

‘గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా పెద్ద కుదుపు. మేలుకుని చూసేసరికి బోగీలు పక్కకు పడిపోయివున్నాయి.

కాన్పూర్‌: ‘గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా పెద్ద కుదుపు. మేలుకుని చూసేసరికి బోగీలు పక్కకు పడిపోయివున్నాయి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. నేను 5వ నంబర్‌ బోగీలో ఉన్నాను. నాతో పాటు వచ్చిన నలుగురైదుగురు కనిపించకుండా పోయారు. వారంతా ఏమయ్యారోనని ఆందోళనగా ఉంది. మహాకాళి దయతోనే నేను బతికి బయటపడ్డాన’ని పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ప్రయాణికుడొకరు తెలిపారు.

‘మేము లక్నోలో దిగ్సాలివుంది. హఠాత్తుగా పెద్ద కుదుపు వచ్చి, పక్కకు పడిపోయాం. మాతో పాటు వచ్చిన ఐదుగురు జాడ తెలియడం లేద’ని ఓ యువతి వాపోయింది. కాన్పూర్‌ సమీపంలో పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 63 మంది మృతి చెందారు. 150 మందిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను కాన్పూర్‌ లోని ఆస్పత్రులకు తరలించారు. నిలిచిపోయిన ప్రయాణికులను ప్రత్యేక రైలులో మలాసా రైల్వే స్టేషన్‌ కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement