జనవరి 26న దాడిచేస్తాం: ఐసిస్‌ లేఖ కలకలం | warning of an attack on cargo on 26th Jan 2018 by ISIS | Sakshi
Sakshi News home page

జనవరి 26న దాడిచేస్తాం: ఐసిస్‌ లేఖ కలకలం

Nov 29 2017 8:03 PM | Updated on Nov 29 2017 8:07 PM

warning of an attack on cargo on 26th Jan 2018 by ISIS - Sakshi


సాక్షి,ముంబై: ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బెదిరింపు లేఖ కలకలం రేపింది.  2018 జనవరి 26న దాడి చేస్తామంటూ ఐఎస్‌ఎస్‌ హెచ్చరించిన లేఖ కార్గో విమానంలో  వెలుగు చూసింది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది.  అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్న విమానాశ్రయం పీఆర్‌వో  వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ ఈ బెదిరింపు లేఖ  అంశాన్ని ఎఎన్‌ఐ రిపోర్ట్‌ చేసింది.
 
ముంబై విమానాశ్రయంలో కార్గో విమానం బాత్‌ రూంలో బుధవారం ఈ వార్నింగ్‌ లెటర్‌ దర్శనమిచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ముమ్మరంగా సోదాలు చేపట్టారు. పోలీసులు, సీఐఎస్‌ఎప్‌ దళాలు  రంగంలోకి దిగాయి. ప్రయాణీకులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత మాత్రమే ప్రవేశానికి అనుమతినిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement