కొండెంగ‌కు గోరుముద్ద‌లు తినిపించిన మ‌హిళ‌ | Viral Video: Woman Feeding Langur Like a Child | Sakshi
Sakshi News home page

కొండెంగకు ప్రేమ‌ను పంచిన మాతృమూర్తి

Jun 10 2020 8:46 PM | Updated on Jun 10 2020 9:20 PM

Viral Video: Woman Feeding Langur Like a Child - Sakshi

న్యూఢిల్లీ: ఈ స‌మాజంలో జంతువుల‌కు హాని చేసే మాన‌వ మృగాలే కాదు.. వాటికి సాయం చేసే మంచి మ‌నుషులూ ఉన్నారు. అందుకు నిలువెత్తు సాక్ష్య‌మే ఈ వార్త‌. ఓ మాతృమూర్తి కొండముచ్చు(కొండెంగ‌)కు అన్నం తినిపించింది. అది బ‌ల్ల‌పై ఒకే ద‌గ్గ‌ర కుదురుగా కూర్చోగా ఆమె పెద్ద పెళ్లంలో అన్నం క‌లుపుతూ దాని ఎదుటే నిల‌బ‌డింది. అనంత‌రం దానికి చంటిపాప‌లా గోరు ముద్ద‌లు పెడుతూ తినిపించింది. ఆ జంతువు కూడా ఆమెను స‌తాయించ‌కుండా బుద్ధిగా కూర్చోవ‌డం కొస‌మెరుపు. (వైరల్‌: చిరుతను చంపి ఊరేగించారు)

"ఇంట్లో మా అమ్మ కొండముచ్చుకు అన్నం తినిపిస్తోంది" అంటూ ఓ వ్య‌క్తి వీడియోను షేర్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కు ప‌ది ల‌క్ష‌ల మందికి పైగా వీక్షించారు. మూగ‌జీవానికి, ఆ మ‌హిళ‌కు మ‌ధ్య‌ ఉన్న అనుబంధానికి నెటిజ‌న్లు నివ్వెర‌పోతున్నారు. కొండెంగను ఇంట్లో మ‌నిషిలా చూస్తూ దానికి ఆప్యాయ‌త‌ను అందించిన మ‌హిళా మూర్తిని ఆకాశానికెత్తుతున్నారు. (వైద్యం కోసం ఆస్పత్రికి కొండముచ్చు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement