ఉత్తరాఖండ్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు

Uttarakhand Bus Falls Into Deep Gorge - Sakshi

డెహ్రడూన్‌ : ఉత్తరాఖండ్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఓ ఘటనలో బస్సు లోయలో పడిపోయి ఇద్దరు మృతి చెందగా.. మరో చోట కారు యాక్సిడెంట్‌లో ఒకరు మరణించారు. బస్సు ప్రమాద సంఘటన పూరి జిల్లా ఖాబ్ర గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. బస్సు ఓ లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 16 మంది గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక కారు యాక్సిడెంట్‌ చమోలీ జిల్లా కుంజో గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా.. 9 మందికి గాయాలయ్యాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top