పలువురు జడ్జీల కార్ల కొనుగోలు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 1.42 కోట్లను మంజూరుచేసింది.
జడ్జీల కార్లకు రూ. 1.42 కోట్లు మంజూరు
Dec 3 2016 10:38 AM | Updated on Sep 4 2017 9:49 PM
పలువురు జడ్జీల కార్ల కొనుగోలు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 1.42 కోట్లను మంజూరుచేసింది. ఈ విషయాన్ని ఓ ఉన్నతాధికారి తెలిపారు. మొత్తం 22 జిల్లాల్లో ఉన్న చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లు, చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్లు, స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ల కోసం ఈ కార్లు కొనుగోలు చేస్తారు.
ఆగ్రా, అలహాబాద్, గౌతమ బుద్ధ నగర్, ఘజియాబాద్, కాన్పూర్, లక్నో, మథుర, మీరట్, ఉన్నవ్ జిల్లాలతో పాటు మరో 13 జిల్లాల్లోని జడ్జీలకు కొత్త కార్లు ఇవ్వడానికి ఈ నిధులు ఉపయోగిస్తారని ముఖ్య కార్యదర్శి (న్యాయశాఖ) రంగనాథ్ పాండే తెలిపారు.
Advertisement
Advertisement