నక్సల్స్ దాడిలో ఇద్దరు పోలీసులు మృతి

రాయ్పూర్/నాగపూర్: ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో శనివారం నక్సలైట్ల దాడిలో ఇద్దరు పోలీసులు మరణించారు. తిప్పాపురం గ్రామానికి మోటార్సైకిల్పై వెళుతున్న ఇద్దరు పోలీసులపై నక్సల్స్ కాల్పులు జరిపినట్లు డీఐజీ సుందరరాజ్ తెలిపారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా నక్సలైట్లు మరణించినట్లు పోలీసు అధికారి చెప్పారు. వీరిలో ఒకరిని రామ్కో అలియాస్ కమ్లా మంకు నరోటె (46)గా గుర్తించినట్లు తెలిపారు. ఈమె తలపై 16 లక్షల రివార్డు ఉంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి