న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో యూరీ సెక్టార్ లోని ఆర్మీ బెటాలియన్ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఉగ్రవాద దాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిని పిరికిపందల చర్యగా ఆయన పేర్కొన్నారు. ఈ దాడి వెనుకున్న కుట్రదారులను చట్టముందు నిలబెడతామని జాతికి ఆయన హామీయిచ్చారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించకుండా వదలబోమన్నారు.
దాడి గురించి తెలిసిన వెంటనే హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించినట్టు తెలిపారు. కశ్మీర్ వెళ్లమని పరీకర్ ను ఆదేశించినట్టు వెల్లడించారు. ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీర జవాన్లకు ప్రధాని నివాళి అర్పించారు. వారి త్యాగాన్ని సదా స్మరించుకుంటామని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఉత్తర కశ్మీర్ లోని యూరీ పట్టణంలో ఆర్మీ బెటాలియన్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 17 మంది సైనికులు వీరమరణం పొందారు. 19 మంది గాయపడ్డారు. దాడికి పాల్పడిన నలుగురు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
వారిని శిక్షించకుండా వదలం: ప్రధాని మోదీ
Published Sun, Sep 18 2016 2:20 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
Advertisement