భద్రతాదళాల కాల్పుల్లో.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

Terrorists Bodies recovered in Srinagar - Sakshi

శ్రీనగర్‌ : శ్రీనగర్‌ శివారులో నోగామ్‌లోని సూతూలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. బుధవారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. భద్రతాదళాల కాల్పుల్లో ఇద్దరు మృతిచెందారు. ఆ ప్రాంతంలో ఇంటర్‌నెట్‌ సర్వీసులను నిలిపి వేశారు. మిలిటెంట్ల కోసం నోగామ్‌లోని సూతూలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top