- తుది మార్గదర్శకాలు మేం ఖరారు చేస్తాం
- న్యాయాధికారుల విభజనపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి హైకోర్టుతో సంప్రదింపులు జరిపి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఉండాల్సిన సబార్డినేట్ జ్యుడీషియల్ అధికారుల సంఖ్యను నిర్ధారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉమ్మడి హైకోర్టు రూ పొందించిన క్యాడర్ విభజన మార్గదర్శకాలను ముసాయి దాగా పరిగణించాలని, వీటిపై తగిన సూచనలు తీసుకుని కేంద్రం జూన్ 17లోగా మార్గదర్శకాల ముసాయిదాను త యారు చేయాలని పేర్కొంది. ఈ ముసాయిదాను పరిశీలించి తుది మార్గదర్శకాలను తాము ఖరారు చేస్తామని చెబు తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. న్యా యాధికారుల విభజనకు సంబంధించి ఉమ్మడి హైకోర్టు రూపొందించిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం 3 రోజులుగా విచారణ జరిపి శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది.
వివాదాన్ని పరిష్కరించే ప్రక్రియ ఇలా...
న్యాయాధికారుల కేటాయింపునకు సంబంధించి దాఖలైన రిట్ పిటిషన్, స్పెషల్ లీవ్ పిటిషన్లు విభిన్నమైన ప్రశ్నల ను లేవనెత్తాయని, ఆయా అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. ఇక వాద ప్రతివా దులకు ఈ ప్రక్రియలో భాగంగా కోర్టు 3 సూచనలు చేసింది.
► అవతరణ తేదీని దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి హైకోర్టుతో సంప్రదింపులు జరిపి 2 రాష్ట్రాల్లో జ్యుడీషియల్ అధికారుల క్యాడర్ ఎంత ఉండాలో తేల్చేందుకు తగిన మార్గదర్శకాలు రూపొందించి క్యాడర్ సంఖ్యను నిర్ధారించాలి.
► ఈ కసరత్తు నేటి నుంచి నాలుగు వారాల్లో పూర్తవ్వాలి.
► క్యాడర్ సంఖ్యను నిర్ధారించిన మీదట, విభిన్న క్యాడర్లకు సంబంధించిన అధికారుల కేటాయింపునకు తగిన మార్గదర్శకాలు రూపొందించాలి.
న్యాయాధికారుల కేటాయింపునకు సంబంధించి ఉమ్మడి హైకోర్టు రూపొందించిన మార్గదర్శకాలపై తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వం కొన్ని సూచ నలు చేయాలని తలచాయని, మరో రకంగా చెప్పాలంటే హైకోర్టు మార్గదర్శకాలు వారికి అంగీకారం కాదని ధర్మాసనం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను అంగీకరించిందని పేర్కొంది.
ఇటీవలి నియామకాలపై...
అవతరణ తేదీ అనంతరం ఉమ్మడి హైకోర్టు.. జ్యుడిషియల్ సర్వీసెస్కు సంబంధించి 130 మంది సివిల్ జడ్జెస్ నియామకాలు జరిపిందని, ఇలా నియమితులైన వారికి సంబంధించి కేటాయింపుల విషయంలో కూడా తగిన మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ ప్రక్రియ జూన్ 30 లోపు పూర్తవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది.
జూన్ 17లోగా ముసాయిదా
Published Sat, Apr 29 2017 1:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement