కాల్పులకు దిగిన పాక్‌..జవాను మృతి

Soldier Killed In Rajouri In As Pak Army Violates Ceasefire - Sakshi

శ్రీనగర్‌ : దాయాది దేశం పాకిస్తాన్‌ మరోసారి బరితెగించింది. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో భారత జవాను యశ్‌ పాల్‌(24 ) ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. కాగా పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్‌పై మెరుపు దాడుల నేపథ్యంలో భారత్‌-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి దాదాపు ప్రతిరోజూ పాకిస్తాన్‌ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో జనవరి నాటి నుంచి ఇప్పటిదాకా మొత్తం 110 సార్లు కాల్పులకు తెగబడింది.

ఇదిలా ఉండగా.. గత సోమవారం నియంత్రణ రేఖ వెంబడి అఖ్‌నూర్‌, సుందర్‌బనీ సెక్టార్లలో పాక్‌ సైన్యం బాంబులతో విరుచుకు పడినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనలో కరమ్‌జీత్‌ సింగ్‌ అనే జవాను మరణించారని పేర్కొన్నారు. గతేడాది పాక్‌ 2936 సార్లు కాల్పులకు దిగిందని, గత పదిహేనేళ్లలో ఇదే అత్యధికమని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top