ప్రముఖ చిత్రకారుడు సతీశ్‌ గుజ్రాల్‌ కన్నుమూత | Renowned artist Satish Gujral passes away | Sakshi
Sakshi News home page

ప్రముఖ చిత్రకారుడు సతీశ్‌ గుజ్రాల్‌ కన్నుమూత

Mar 28 2020 5:55 AM | Updated on Mar 28 2020 5:55 AM

Renowned artist Satish Gujral passes away - Sakshi

సతీశ్‌ గుజ్రాల్‌

న్యూఢిల్లీ: ప్రముఖ చిత్రకారుడు, శిల్పి సతీశ్‌ గుజ్రాల్‌ (94) కన్నుమూశారు. మాజీ ప్రధాన మంత్రి ఐకే గుజ్రాల్‌కు ఈయన సోదరుడు. వయోభారం రీత్యా గురువారం రాత్రి ఆయన కన్నుమూసినట్లు కుటుంబసభ్యుడు, రాజ్యసభ ఎంపీ నరేశ్‌ గుజ్రాల్‌ తెలిపారు. సతీశ్‌ నైపుణ్యం కలిగిన చిత్రకారుడు, శిల్పి, గ్రాఫిక్‌ ఆర్టిస్ట్‌ అంతేగాక దేశంలో రెండో అత్యుత్తమ పురస్కారమైన పద్మవిభూషన్‌ను పొందిన వ్యక్తి. ఆయన మృతిపై దేశ ప్రధాని సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. సతీశ్‌ గుజ్రాల్‌కు ఉన్న అపారమైన జ్ఞానమే ఆయన్ను అంత ఎత్తుకు తీసుకెళ్లిందని, అయినప్పటికీ ఆయన ఎప్పుడూ తగ్గి ఉండేవారని మోదీ కొనియాడారు. కళలు, సాంస్కృతిక విభాగంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement