సామ్నా ఎడిటర్‌గా రశ్మీ ఠాక్రే

Rashmi Thackeray Takes Over As Saamna Editor - Sakshi

సాక్షి, ముంబై : శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’ సంపాదకురాలిగా ఆ పార్టీ చీఫ్‌, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రే ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌గా ఆ పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ కొనసాగనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ, ఉద్ధవ్‌ సంపాదకుడిగా కొనసాగారు. సామ్నాకు మొదటి సంపాదకుడిగా బాల్‌ ఠాక్రే వ్యవహరించగా, ఆయన మరణాంతరం ఉద్ధవ్‌ ఠాక్రే బాధ్యతలు స్వీకరించారు.

జనవరి 23,1988న సామ్నా పత్రికను దివంగత బాల్‌ఠాక్రే ప్రారంభించారు. 2012లో ఆయన మరణించేవరకు ఆయన సంపాదకుడిగా కొనసాగారు. అనంతరం ఆయన కుమారుడు ఉద్ధవ్‌ ఠాక్రే ఆ బాధ్యతలు తీసుకున్నారు. గత ఏడాది ఆయనకు సీఎం పదవి వరించిన నేపథ్యంలో ఎడిటర్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top