బెంగళూరుః బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపి) చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో భాగంగా పఠాన్ కోట్ దాడిలో ప్రాణత్యాగం చేసిన నిరంజన్ కుమార్ నివాసం పడగొట్టాలనుకోవడం ఇప్పుడు రాజకీయ రచ్చకు దారితీస్తోంది. ఉగ్రదాడి సందర్భంలో అసువులు బాసిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ ఎస్జీ) కమాండో లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్ నివాసంలోని కొంత భాగం పడగొట్టేందకు బీబీఎంపి నిశ్చయించింది.
కర్నాటక ముఖ్యమంత్రి ఎస్ సిద్ధరామయ్య సూచనల మేరకు బెంగళూరులో కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండో లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్ నివాసంలోని కొంత భాగాన్ని కూల్చాలని బృహత్ బెంగళూరు మహానగర పాలిక నిశ్చియించింది. అయితే దేశంకోసం ప్రాణత్యాగం చేసిన నిరంజన్ కుమార్ కుటుంబానికి కనీస గౌరవం అందించాల్సి ఉందంటూ, సీఎం నిర్ణయాన్ని భారతీయ జనతాపార్టీ నాయకుడు జగదీష్ షెట్టార్ విభేదిస్తుండగా... ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంజన్ కుటుంబానికి గృహ నిర్మాణంకోసం మరో స్థలాన్ని ఇవ్వనున్నట్లు కర్నాటక హోం మంత్రి జి పరమేశ్వర చెప్తున్నారు.
మరోవైపు తాము చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతకు నిరంజన్ కుటుంబం మద్దతునివ్వడం పట్ల బీబీఎంపీ అసిస్టెంట్ కమిషనర్ ఎ ఆలం ప్రశంసలు కురిపించారు. తమ నివాసంలోని ఆక్రమిత భాగాన్ని పడగొట్టేందుకు అంగీకరించిన ఎన్ఎస్జీ కంమాండో తల్లిదండ్రులకు ఆయన శాల్యూట్ చేశారు. అయితే తన సోదరుడి త్యాగాన్ని గుర్తించయినా కూల్చివేత డ్రైవ్ ను ఆపాలని, లేదంటే కొంత సమయమైనా ఇవ్వాలని నిరంజన్ సోదరుడు కోరారు. ఈ చర్యలు తమకెంతో సిగ్గుగా అనిపిస్తున్నాయని, పఠాన్ కోట్ దాడిలో సోదరుడి ప్రాణాలు పోగొట్టుకున్న బాధలో ఉన్న తాము.. ఇల్లు కూలగొట్టే చర్యను జీర్ణించుకోవడం ఎంతో కష్టంగా ఉందంటూ ఉద్వేగంగా మాట్టాడారు. ముందస్తుగా ప్రయర్ నోటీసులు జారీ చేసి ఉంటే ఏదో ఒకటి చేసేవాళ్ళమని, ఇటువంటి చర్యలు ప్రభుత్వానికే కాక, దేశానికే తలవంపులని ఆందోళన వ్యక్తం చేశారు.
బెంగళూరు నగరంలో డ్రైనేజ్ వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు 'బీబీఎంపీ' కూల్చివేతల కార్యక్రమం చేపట్టింది. నిరంజన్ కుమార్ ఇంటితోపాటు, డ్రైవ్ లో భాగంగా అక్కడి 1100 వరకూ అక్రమ నిర్మాణాలకు మార్కింగ్ కూడా చేసింది. పఠాన్ కోట్ ఉగ్రదాడి సందర్భంలో రాత్రంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించిన ఎన్ఎస్జీ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ లో లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ సభ్యుడు. నిర్వీర్యం చేసే ప్రయత్నంలో గ్రెనేడ్ పేలడంతో నిరంజన్ ప్రాణాలు కోల్పోయాడు.
పఠాన్ కోట్ హీరో ఇల్లు.. పడగొట్టే యత్నం..!
Published Thu, Aug 11 2016 2:05 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
తప్పక చదవండి
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
Advertisement