నేడు విదేశాలకు మోదీ | pm narendra modi foreign tour | Sakshi
Sakshi News home page

నేడు విదేశాలకు మోదీ

May 29 2018 4:02 AM | Updated on Aug 24 2018 2:17 PM

pm narendra modi foreign tour - Sakshi

న్యూఢిల్లీ: ఆసియా దేశాలైన ఇండోనేసియా, సింగపూర్, మలేసియాలతో భారత్‌కు బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ మూడు దేశాల్లో తన పర్యటనతో ప్రస్తుతమున్న సంబంధాలు మరింత బలోపేతం అవుతాయన్నారు. మే 29 నుంచి జూన్‌ 2వరకూ మోదీ ఇండోనేసియా, సింగపూర్, మలేసియాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తన పర్యటన వివరాలను ప్రధాని ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. ఇండోనేసియా రాజధాని జకార్తాకు మే 29న చేరుకోనున్నట్లు మోదీ తెలిపారు. మరుసటిరోజు ఆ దేశ ప్రధాని జోకో విడోడోతో భేటీ అవుతానన్నారు.

ఆతర్వాత ఇండియా–ఇండోనేసియా సీఈవో ఫోరమ్‌తో, ఇక్కడి భారత సంతతి ప్రజలతో సమావేశమవుతానని వెల్లడించారు. అనంతరం మే 31న సింగపూర్‌కు వెళ్తానన్నారు. ఈ పర్యటనలో టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, పట్టణ ప్రణాళిక, కృత్రిమ మేథ రంగాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలు పెంపొందించడంపై దృష్టి సారిస్తామన్నారు. జూన్‌ 1న సింగపూర్‌ ప్రధాని లీతో సమావేశమవుతానని మోదీ తెలిపారు. సింగపూర్‌కు వెళ్లేముందు మలేసియాలో ఆగి ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మహతీర్‌ మొహమ్మద్‌కు శుభాకాంక్షలు తెలపనున్నట్లు మోదీ చెప్పారు. సింగపూర్‌లో 28 ఆసియా–పసిఫిక్‌ దేశాల రక్షణమంత్రులు, ఆర్మీచీఫ్‌లు హాజరయ్యే షాంగ్రీలా సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement