నెలాఖరు నుంచి మోదీ ప్రచారం? | PM Modi likely to campaign in West Bengal from March-end | Sakshi
Sakshi News home page

నెలాఖరు నుంచి మోదీ ప్రచారం?

Mar 13 2016 10:57 AM | Updated on Aug 15 2018 2:20 PM

పశ్చిమబెంగాల్లో మార్చి చివరి వారం నుంచి ప్రధానిమోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చెప్పారు.

కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో మార్చి చివరి వారం నుంచి ప్రధానిమోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చెప్పారు.  మూడు, నాలుగు దశల్లో జరిగే ఎన్నికల కోసం ప్రధాని తేదీల్ని కోరామని, మొత్తం పది సభల్లో ప్రసంగించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రధాని నుంచి సమాచారం రావాల్సివుందని చెప్పారు.

జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు బీజేపీ ప్రధాన నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు. కాగా, మహారాష్ట్ర, హర్యానా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులతో కూడా ప్రచారం చేయించాలని బీజేపీ భావిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement