మేడారం జాతరకు రండి

ఉప రాష్ట్రపతికి తెలంగాణ మంత్రి ఆహ్వానం

న్యూఢిల్లీ: మేడారం జాతరకు రావాల్సిందిగా ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడిని తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆహ్వానించారు. ఢిల్లీలో ఉప రాష్ట్రపతిని ఈ ఉదయం కలిసిన ఆయన జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరగనున్నఈ మహా జాతరకు రావాల్సిందిగా కోరారు. ఈ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కూడా విజ్ఞప్తి చేశారు. మంత్రితోపాటు రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, పలువురు ఎంపీలు ఉన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top