బీహార్లో మందు పాతర పేలి 8 మంది పోలీసులు మృతి చెందారు.
పాట్నా(ఐఏఎన్ఎస్): బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో మందు పాతర పేలి 8 మంది పోలీసులు మృతి చెందారు. మందు పాతర పేలడంతో పోలీస్ జీపు తునాతునకలైంది. ఆ జీపులో ఉన్న 8 మంది పోలీసులు దుర్మరణం చెందారు.
ఈ ఘటన తాడ్వా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు అడిషనల్ డైరెక్టర్ జనరల్ అమిత్ కుమార్ చెప్పారు.