దీపావళి ప్రత్యేక బస్సులు రోడ్డెక్కాయి. శుక్రవారం నుంచి ఆయా నగరాలు, జిల్లా కేంద్రాలకు పరుగులు తీశాయి. కోయంబేడులో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రద్దీని క్రమ బద్ధీకరించే విధంగా చర్యలు తీసుకున్నారు.
* రోడ్డెక్కిన ప్రత్యేక సర్వీసులు
* కోయంబేడులో పార్కింగ్ ఏర్పాట్లు
సాక్షి, చెన్నై: వెలుగుల పండుగ దీపావళిని ఇంటిల్లి పాది ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధం అవుతున్నారు. స్వగ్రామాలకు తరలి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో, సోమ, మంగళ వారాలు సెలవులు పెట్టుకున్న ఉద్యోగులు తమ స్వగ్రామాలకు బయలు దేరారు. రైళ్లు ఇప్పటికే హౌస్ఫుల్ కాగా, బస్సుల మీద దృష్టి పెట్టక తప్పలేదు. ఓ వైపు ఆమ్నీ బస్సులు, మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ బస్సులు చెన్నై నుంచి దక్షిణాదిలోని జిల్లాలకు పరుగులు తీయడానికి రెడీ అయ్యాయి. ప్రభుత్వ ప్రత్యేక బస్సులు శుక్రవారం రోడ్డెక్కాయి.
చర్యలు: దీపావళిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 8 వేలకు పైగా ప్రత్యేక బస్సుల్ని నడిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చెన్నై నుంచి దక్షిణాది జిల్లాలకు, కొంగు మండాలనికి, డెల్టా జిల్లాలకు 4 వేల బస్సులు పరుగులు తీసే విధంగా ఏర్పాట్లు చేశారు. కోయంబేడులోని ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించే విధంగా శుక్రవారం నుంచి బస్సులు రోడ్డెక్కించారు. తొలి రోజు 500 బస్సులు నడిచాయి. శనివారం మరో 500, ఆదివారం 700, సోమవారం 2100, మంగళవారం 1652 బస్సుల్ని నడిపేందుకు సర్వం సిద్ధం చేశారు. అలాగే, కోయంబేడు మార్కెట్ పరిసరాల్ని ప్రత్యేక బస్సులకు పార్కింగ్ స్టాండ్గా నిర్ణయించారు. అలాగే, ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికుల కోసం టెర్మినల్ ముందు భాగంలో 21 కౌంటర్లను ఏర్పాటు చేశారు.
ప్రత్యేక ఏర్పాట్లు : కోయంబేడు టెర్మినల్లో తొమ్మిది అతి పెద్ద ఫ్లాట్ ఫారాలు ఉన్నాయి. ఒక్క ఫ్లాట్ ఫాంలో 50కు పైగా బస్సుల్ని నిలబెట్టేందుకు వీలుంది. ఈ ఫ్లాట్ ఫారాలను దీపావళిని పురస్కరించుకుని విభజించారు. ఒకటి, రెండు ఫ్లాట్ ఫారాలను అన్ రిజర్వుడ్తో నడిచే బస్సుల కోసం సిద్ధం చేశారు. ఇక్కడ 200 కి. మీ దూరంలోపు ప్రయాణించే బస్సులు, వేలూరు, కాంచీపురం, విల్లుపురం వరకు నడిచే బస్సులు ఉంటాయని బోర్డుల్ని ఏర్పాటు చేశారు. 3, 4, 5, 6 ఫ్లాట్ ఫారాల్లో మదురై, తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి తదితర దక్షిణాది జిల్లాలకు వెళ్లే బస్సులు ఉంటాయి. 7, 8, 9ఫ్లాట్ ఫారాల్ని సుదూర ప్రాంతాలకు వెళ్లే అన్రిజర్వుడ్ బస్సులకు కేటాయించారు. అలాగే, మహిళలు, పిల్లలతో వెళ్లే వారి కోసం ఈ ఫ్లాట్ ఫారాల వద్ద ఉన్న కౌంటర్లలో ప్రత్యేక టోకెన్లు ఇస్తున్నారు. ఈ టోకెన్ల ఆధారంగా బస్సుల్లో సీట్లు సులభంగా చిక్కుతాయి.
బస్సుల పరుగు!
Published Sat, Oct 18 2014 1:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement