నద్దాకే పార్టీ పగ్గాలు! | JP nadda leading the Over the reins! | Sakshi
Sakshi News home page

నద్దాకే పార్టీ పగ్గాలు!

May 25 2014 1:36 AM | Updated on Sep 2 2017 7:48 AM

నద్దాకే పార్టీ పగ్గాలు!

నద్దాకే పార్టీ పగ్గాలు!

ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ జేపీ నద్దాకే పార్టీ అధ్యక్ష పదవి లభించే అవకాశముందని తెలుస్తోంది. అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ మోడీ ప్రభుత్వంలో చేరే అవకాశముండటంతో.. ఆయన వారసుడెవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

బీజేపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ జేపీ నద్దాకే పార్టీ అధ్యక్ష పదవి లభించే అవకాశముందని తెలుస్తోంది. అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ మోడీ ప్రభుత్వంలో చేరే అవకాశముండటంతో.. ఆయన వారసుడెవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. మోడీకి సన్నిహితుడైన అమిత్‌షాకు, పార్టీ మాజీ చీఫ్ గడ్కారీకి నద్దా అత్యంత సన్నిహితుడు కావడం ఆయనకు అనుకూలించే అంశం. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన నద్దా ఆరెస్సెస్‌కు విశ్వాస పాత్రుడని, అందువల్ల ఆరెస్సెస్ కూడా నద్దా వైపే మొగ్గు చూపుతోందని తెలుస్తోంది.

పార్టీ విద్యార్థి విభాగం ఏబీవీపీ, యువ విభాగం భారతీయ యువమోర్చాల్లో నద్దా పనిచేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ.. లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 4 స్థానాలను బీజేపీ గెలుచుకోవడంలో నద్దా కీలకపాత్ర పోషించారు. అయితే, పార్టీలో పెద్దగా ప్రచారంలేని నద్దాకు అధ్యక్ష పదవి అప్పగించాలనుకోవడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement