పీవీ నుంచి నేటి జయ వరకు అదే కంపెనీ | Jayalalithaa coffin maker architect of 500 VIP caskets | Sakshi
Sakshi News home page

పీవీ నుంచి నేటి జయ వరకు అదే కంపెనీ

Dec 7 2016 11:33 AM | Updated on Sep 4 2017 10:09 PM

పీవీ నుంచి నేటి జయ వరకు అదే కంపెనీ

పీవీ నుంచి నేటి జయ వరకు అదే కంపెనీ

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థీవ దేహాన్ని ఖననం చేయడం కోసం ప్రత్యేకంగా గందపు చెక్కలతో తయారుచేసిన శవపేటికను తయారు చేయించారు.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థీవ దేహాన్ని ఖననం చేయడం కోసం ప్రత్యేకంగా గందపు చెక్కలతో తయారుచేసిన శవపేటికను తయారు చేయించారు. అయితే, ఈ పేటికను రూపొందించిన కంపెనీ ఇప్పటి వరకు దాదాపు 500 మంది ప్రముఖులకు పేటికలను తయారు చేసి ఇచ్చిందంట. జయ చనిపోయిన వెంటనే ప్రత్యేక పేటికను రూపొందించే పనిని ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అండ్‌ హోమేజ్‌ కంపెనీకి అప్పగించారు. దీంతో ప్రత్యేకంగా గందపు చెక్కలతో ఆ కంపెనీ శవపేటికను రూపొందించి ఇచ్చింది.

ఈ పేటికలోపల 0 నుంచి 5డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతను కొనసాగించగలిగితే మూడు రోజుల వరకు కూడా మృతదేహం చెక్కు చెదరదని ఆ కంపెనీ చెబుతోంది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ప్రముఖ నటుడు శివాజీ గణేశన్‌, మనోరమవంటి ప్రముఖులకు కూడా ఈ కంపెనీనే పేటికలను రూపొందించింది. ‘జయకోసం రూపొందించిన పేటికను హెవీ డ్యూటీ కంప్రెజర్‌, ఫ్రీజర్‌ బాక్స్‌ రూపొందించాం. ఇది శరీరాన్ని త్వరగా చెడిపోకుండా ఉంచుతుంది’ అని ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌ పీఆర్‌ఎంఎం శాంతకుమార్‌ తెలిపారు. 1994లో పేటికలను తయారుచేసి హక్కును పొందిన ఆయన ఇప్పటి వరకు 500మంది ప్రముఖులకోసం ప్రత్యేక పేటికలను తయారు చేయించి ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement