భారత్‌కూ స్పేస్‌ స్టేషన్‌

Isro Planning To Launch Spl Space Station - Sakshi

న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. భారత్‌ సొంతంగా ఓ స్పేస్‌ స్టేషన్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోందని ఇస్రో చీఫ్‌ కే శివన్‌ గురువారం వెల్లడించారు. గగన్‌యాన్‌ మిషన్‌కు కొనసాగింపుగా ఈ ప్రాజెక్టును చేపడతామని చెప్పారు. మానవ సహిత గగన్‌యాన్‌ కార్యక్రమాన్ని పూర్తిచేసిన అనంతరం ఇదే ఊపును కొనసాగించేందుకు మనకు సొంత స్పేస్‌ స్టేషన్‌ ఉండాలని భావిస్తున్నామని చెప్పారు.

కాగా జులైలో జరిగే చంద్రయాన్‌ 2, 2022లో జరిగే గగన్‌యాన్‌పై తాము దృష్టి కేంద్రీకరించామని, ఈ మిషన్‌ పూర్తయిన తర్వాత స్పేస్‌ స్టేషన్‌పై ఫోకస్‌ చేస్తామని అన్నారు. స్పేస్‌ స్టేషన్‌ను పూర్తిస్ధాయిలో అభివృద్ధి చేసేందుకు ఐదు నుంచి ఏడేళ్ల సమయం పడుతుందని, ఖర్చు విషయం ఇప్పుడే చెప్పలేమని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top