భారత్లో 21.17 లక్షల హెచ్ఐవీ రోగులు | India home to 21L HIV+, 3rd highest in world | Sakshi
Sakshi News home page

భారత్లో 21.17 లక్షల హెచ్ఐవీ రోగులు

Mar 12 2016 11:43 AM | Updated on Sep 3 2017 7:35 PM

భారత్లో 21.17 లక్షల హెచ్ఐవీ రోగులు

భారత్లో 21.17 లక్షల హెచ్ఐవీ రోగులు

భారత్లో హెచ్ఐవీ రోగుల సంఖ్య నానాటికి పెరుగుతుంది.

న్యూఢిల్లీ : భారత్లో హెచ్ఐవీ రోగుల సంఖ్య నానాటికి పెరుగుతుంది. ప్రస్తుతం 21.17 లక్షల మంది హెచ్ఐవీ రోగులతో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జె.పి.నడ్డా వెల్లడించారు. శుక్రవారం లోక్సభలో మంత్రి నడ్డా మాట్లాడుతూ... 68 లక్షల మంది హెచ్ఐవీ రోగులతో దక్షిణాఫ్రికా మొదటి స్థానం ఆక్రమించగా... 34 లక్షలతో నైజీరియా రెండో స్థానంలో నిలిచిందన్నారు. అయితే దేశంలో కొత్త హెచ్ఐవీ కేసుల నమోదు సంఖ్య తగ్గిందన్నారు. ఈ కేసుల సంఖ్య తగ్గించడం ఈ ప్రభుత్వానికి ఓ చాలెంజ్ అని జె.పి.నడ్డా అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement