కాబుల్‌ మృతులకు భారత్‌ నివాళులు | India condemns terror attacks in Kabul | Sakshi
Sakshi News home page

కాబుల్‌ మృతులకు భారత్‌ నివాళులు

Mar 2 2017 2:01 PM | Updated on Nov 6 2018 8:35 PM

అప్ఘనిస్తాన్‌లో ముష్కరులు బుధవారం జరిపిన దాడుల్లో మృతి చెందినవారికి భారత విదేశాంగ శాఖ నివాళులర్పించింది.

న్యూఢిల్లీ: అప్ఘనిస్తాన్‌లో ముష్కరులు బుధవారం జరిపిన దాడులలో మృతి చెందినవారికి భారత విదేశాంగ శాఖ నివాళులర్పించింది. ఈ దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. మానవ బాంబులతో ముష్కరులు అప్ఘన్‌ రాజధాని కాబుల్‌లో రెండుసార్లు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా 43 మం‍ది గాయపడ్డారు. భారత్‌ కూడా ఉగ్ర బాధిత దేశమని, ఉగ్రవాద నిర్మూలనకు అప్ఘనిస్తాన్‌తో కలిసి పోరాడతామని విదేశాంగ శాఖ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement