రాత్రి వేళ ఆపరేషన్లకు ఐఏఎఫ్ సిద్ధం

IAF projects day and night combat capability in ladakh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఓ వైపు చైనా బలగాలు వాస్తవాధీన రేఖ నుంచి రెండు కిలోమీటర్ల మేర వెనక్కు వెళ్లినా, భారత్​ మాత్రం గల్వాన్​ వ్యాలీ ఘటనను దృష్టిలో ఉంచుకుని ఆచితూచి అడుగేస్తోంది. డ్రాగన్​ దుర్భుద్దిని దృష్టిలో పెట్టుకుని ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేందుకు వైమానిక దళాలను సంసిద్ధంగా ఉంచింది. సుఖోయ్​, చినూక్, అపాచీలతో సహా మిగ్​–29 ఫైటర్​ జెట్లు రాత్రి వేళల్లో  ఆపరేషన్లకు సిద్ధంగా ఉన్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని పెద్దాఫీసరు మంగళవారం తెలిపారు. (చైనా యాప్‌ల బ్యాన్‌ దిశగా అమెరికా?)

గతంలో రాత్రిపూట పైటర్ జెట్లతో గస్తీ ఇబ్బందికరంగా ఉండేదని, ప్రస్తుతం పరిస్థితులు మారాయని మాజీ ఎయిర్​ వైస్​ మార్షల్​ మన్మోహన్​ బహదూర్ చెప్పారు. చైనా మళ్లీ దుందుడుకు చర్యకు దిగితే దీటుగా బదులిచ్చేందుకే లడఖ్​లోని ఎయిర్​బేస్​లు హైఅలర్డ్​లో ఉన్నాయని మరో అధికారి వెల్లడించారు. గల్వాన్​ ఘటన తర్వాత సైనికులను లడఖ్ తరలించడంలో వాయుసేనకు చెందిన సీ–17 గ్లోబ్​ మాస్టర్ 3, సీ130జే సూపర్​ హెర్క్యూలిస్​ విమానాలు కీలకపాత్ర పోషించాయని ఆయన తెలిపారు. (భారీ కుంభకోణం : బ్యాంకు మాజీ సీఈఓ ఆత్మహత్య?)

చైనా విదేశాంగ మంత్రితో భారత భద్రతా సలహాదారు ధోవల్​ సమావేశం తర్వాత గల్వాన్​ వ్యాలీ, హాట్​ స్పింగ్స్​తో పాటు గోగ్రా ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల మేర చైనా సైనికులు వెనక్కు వెళ్లారు. కీలకమైన పాంగ్యాంగ్​ సో వద్ద గల ఫింగర్​ పాయింట్ లో ఉంటున్న చైనా సైనికుల సంఖ్య తగ్గింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top