యూపీలో సున్నీ, షియా వక్ఫ్‌బోర్డుల విలీనం | UP govt plans to merge Shia, Sunni Waqf boards to prevent 'wastage of money' | Sakshi
Sakshi News home page

యూపీలో సున్నీ, షియా వక్ఫ్‌బోర్డుల విలీనం

Oct 23 2017 3:23 AM | Updated on Oct 23 2017 3:23 AM

UP govt plans to merge Shia, Sunni Waqf boards to prevent 'wastage of money'

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సున్నీ, షియా వక్ఫ్‌బోర్డులను విలీనం చేసి ముస్లిం వక్ఫ్‌బోర్డును ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం యోచిస్తోంది. సున్నీ, షియా వక్ఫ్‌బోర్డులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయనీ, అందుకే త్వరలో ప్రభుత్వం వాటిని విలీనం చేసి కొత్త సంస్థను ఏర్పాటు చేయనుందని వక్ఫ్‌ శాఖ సహాయ మంత్రి మొహ్సిన్‌ రజా చెప్పారు.

దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందనీ, కొత్తగా ఏర్పడే బోర్డులో సున్నీ, షియా ఇరు వర్గాల వారు ఉంటారని మంత్రి వెల్లడించారు. రెండు బోర్డులను విలీనం చేయాలని ప్రభుత్వానికి అనేక వినతులు వచ్చిన తర్వాతనే దీనిపై ఆలోచిస్తున్నామని రజా పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement