రెండేళ్ల గరిష్ట స్థాయికి సహజ వాయువు ధర? | Government to raise gas price to highest level in 2 years | Sakshi
Sakshi News home page

రెండేళ్ల గరిష్ట స్థాయికి సహజ వాయువు ధర?

Mar 23 2018 2:12 AM | Updated on Jul 6 2019 3:20 PM

Government to raise gas price to highest level in 2 years - Sakshi

న్యూఢిల్లీ: దేశీయ సహజ వాయువు ధరను పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే వారమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ అదే జరిగితే రెండేళ్లలో ఇదే గరిష్ట పెంపు కానుంది. దీని వల్ల సీఎన్‌జీ, విద్యుత్, యూరియా తదితరాల ధరలు పెరుగుతాయి. స్వదేశంలో ఉత్పత్తి అయ్యే మిలియన్‌ బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌(ఎంబీటీయూ) సహజ వాయువు ధర ఏప్రిల్‌ 1 నుంచి ప్రస్తుతమున్న 2.89 డాలర్ల(సుమారు రూ.189) నుంచి 3.06 డాలర్ల(రూ.199)కు పెరిగే అవకాశాలున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement