గీజర్‌ నుంచి విషవాయువు.. బాలిక మృతి  | Girl Killed By Poison Gas From Electric Geyser In Mumbai | Sakshi
Sakshi News home page

గీజర్‌ నుంచి విషవాయువు.. బాలిక మృతి 

Jan 15 2020 7:19 AM | Updated on Jan 15 2020 7:28 AM

Girl Killed By Poison Gas From Electric Geyser In Mumbai - Sakshi

ముంబై : గీజర్‌ నుంచి కార్బన్‌ మోనాక్సైడ్‌ వాయువు వెలువడి బాలిక మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైలోని బొరివలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 5న ఉదయం స్నానం చేసేందుకు బాత్‌రూమ్‌లోకి వెళ్లిన ధృవి గోహిల్‌ (15) ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు తలుపులు పగులగొట్టి చూశారు. అప్పటికే ధృవి అపస్మారక స్థితిలో పడి ఉంది. వేడినీటి కారణంగా ఆమె శరీరం కుడిపక్కన కాలిన గాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. మృత్యువుతో పోరాడిన బాలిక ఈ నెల 10న మృతిచెందింది. కార్బన్‌ మోనాక్సైడ్‌ను అధికంగా పీల్చడం వల్లే ఈ ఘోరం జరగినట్లు వైద్యులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement