రాజా, కనిమొళికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు | Delhi High Court issues notices to A Raja, Kanimozhi on Enforcement | Sakshi
Sakshi News home page

రాజా, కనిమొళికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Mar 22 2018 2:52 AM | Updated on Mar 22 2018 2:52 AM

Delhi High Court issues notices to A Raja, Kanimozhi on Enforcement - Sakshi

రాజా, కనిమొళి

న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్‌ కేసుకు సంబంధించి టెలికం మాజీ మంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళికి ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది. ఈ కేసులో వారిని ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని కోరింది. మనీ ల్యాండరింగ్‌ కేసులోనూ వారిని నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ ఈడీ వేసిన పిటిషన్‌పై కూడా ఇలాంటి ఆదేశాలే జారీచేసింది. తదుపరి విచారణ జరిగే మే 25 లోగా స్పందనలు తెలపాలని వారికి సూచించింది.  

Advertisement
 
Advertisement
Advertisement